టిప్పర్‌ను ఢీకొన్న లారీ.. 20 మందికి గాయాలు

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి మినీ లారీ ఢీకొనడంతో 20 మందికి గాయాలయ్యాయి. కడప జిల్లా గోపవరం మండలం పీపీగుంటకు చెందిన పెళ్లి బృందం నెల్లూరు జిల్లా కదలకూరు మండలం గిద్దలూరుకు..

Updated : 21 Jun 2021 06:45 IST

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి మినీ లారీ ఢీకొనడంతో 20 మందికి గాయాలయ్యాయి. కడప జిల్లా గోపవరం మండలం పీపీగుంటకు చెందిన పెళ్లి బృందం నెల్లూరు జిల్లా కదలకూరు మండలం గిద్దలూరుకు మినీ లారీలో బయలుదేరింది. మార్గమధ్యంలో ఉప్పలపాడు సమీపంలో జాతీయ రహదారికి ఒకవైపు టిప్పర్‌ ఆగి ఉంది. ఇది గమనించని మినీ లారీ డ్రైవర్‌ అదుపుతప్పి మినీ లారీని వెనకనుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగురికి కాళ్లు, చేతులు విరిగాయి. మరో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని