Jaipur Express: అతడికి షార్ట్ టెంపర్.. కనిపించిన వారిని కాల్చుకుంటూ పోయాడు..!
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రవర్తనే సోమవారం ఉదయం జైపుర్ ఎక్స్ప్రెస్(Jaipur Express)లో కాల్పుల ఘటనకు కారణమైందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు.
ముంబయి: జైపుర్ ఎక్స్ప్రెస్(Jaipur Express)లో ఈ తెల్లవారుజామున చోటుచేసుకున్న కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. రాజస్థాన్లోని జైపుర్ నుంచి ముంబయి వెళ్తున్న రైల్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణా రహితంగా కాల్పులు జరపగా.. నలుగురు మృతి చెందారు. పాల్ఘర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కాల్పులకు పాల్పడిన నిందితుడి ప్రవర్తన గురించి సంబంధిత ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు.
సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(Railway Protection Force (RPF)) కానిస్టేబుల్ చేతన్ సింగ్ తన సీనియర్ ఏఎస్సై టికారామ్ మీనాను కాల్చి చంపేశాడు. తర్వాత మరో బోగీలోని ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరపడంతో వారు కూడా ఘటనాస్థలంలోని ప్రాణాలు కోల్పోయారు. అనంతరం తర్వాతి స్టేషన్లో రైలు దూకి, పారిపోయేందుకు యత్నించి పట్టుబడ్డాడు. దీనిపై ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్(వెస్టర్న్ రైల్వే) ప్రవీణ్ సిన్హా మీడియాతో మాట్లాడారు. ‘అతడికి షార్ట్ టెంపర్. వెంటనే కోపం తెచ్చుకునే స్వభావం ఉంది. ఆ సమయంలో పెద్ద గొడవేం జరగలేదు. కానీ అతడు క్షణికావేశంతో తన సీనియర్ను కాల్చివేశాడు. తర్వాత కనిపించిన వారిని కాల్చుకుంటూ పోయాడు’ అని తెలిపారు. మరోపక్క తాను మానసికంగా వేధింపులకు గురయ్యాయని చేతన్ కూడా ఫిర్యాదు చేశాడు.
చేతన్ ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)వాసి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన టికారామ్ది రాజస్థాన్(Rajasthan). 2025లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఏఎస్సై కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అలాగే మృతి చెందిన ముగ్గురు ప్రయాణికులకు కూడా పరిహారం ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
రైళ్లలో భద్రత కోసం ఆర్పీఎఫ్(RPF) సిబ్బందికి ఎస్కార్ట్ డ్యూటీ వేస్తారు. జైపుర్ రైల్లో ఏఎస్సై, చేతన్ సహా నలుగురు సిబ్బంది ఆ విధుల్లో ఉన్నారు. వారు గుజరాత్లోని సూరత్లో రైలెక్కారు. ఈ ఘటనపై మిగతా ఇద్దరు సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.