Crime News: సింగరేణి కాలనీలో బాలిక హత్య ఘటన.. అనుమానితుడి కోసం ముమ్మర గాలింపు

నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో కలకలం రేపిన బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న

Updated : 11 Sep 2021 07:30 IST

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో కలకలం రేపిన బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తెలంగాణలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లకు అతడి ఫొటోను పంపారు. ఆచూకీ తెలిస్తే తక్షణం సమాచారం ఇవ్వాలని ఉన్నతాధికారులు వివిధ జిల్లాల పోలీసులను కోరారు. తూర్పు మండలం డీసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు అనుమానితుడి కోసం గాలిస్తున్నాయి. రాజు తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో అతని ఆచూకీ లభించడంలో జాప్యం జరుగుతోంది. అనుమానితుడి బంధువులు, కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని