Crime news : నడి రోడ్డుపై కూలిపోయిన మలేసియా విమానం.. ప్రమాద దృశ్యాలు వైరల్
మలేసియాలో (Malaysia) ఓ చిన్న విమానం (Light Plane) నడిరోడ్డుపై కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు ఓ వాహనం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి.
కౌలాలంపూర్ : మలేసియా (Malaysia) సెంట్రల్ సెలంగర్ రాష్ట్రంలోని ఓ రద్దీ రహదారిపై విమానం (Light Plane) కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. లంగ్కావి ద్వీపం నుంచి ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో ఓ చిన్న విమానం గురువారం మధ్యాహ్నం బయలుదేరింది. సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయం వైపు ప్రయాణం సాగిస్తుండగా అందులో సమస్య తలెత్తింది. దాంతో విమానం గాల్లో అస్తవ్యస్తంగా గింగిరాలు తిరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఏం జరుగుతుందోనని చూస్తుండగానే అది నేల కూలింది.
ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి, మరో ద్విచక్ర వాహనదారుడు కూడా చనిపోయారని వెల్లడించారు. మృతుల్లో సెంట్రల్ పహాంగ్ రాష్ట్రానికి చెందిన చట్టసభ్యుడు జోహారీ హరున్ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు ఓ వాహనం డ్యాష్బోర్డు కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్గా మారాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై భారీగా అగ్ని వెలువడి, పరిసరాలను నల్లని పొగ కమ్మేసింది.
ప్రేమను తిరస్కరించిందని.. బాలికను 10 సార్లు కత్తితో పొడిచి..
ప్రమాదంపై మలేసియా ఎయిర్ఫోర్స్ మాజీ సభ్యుడు మహమ్మద్ శ్యామీ మహమ్మద్ హషీమ్ మాట్లాడుతూ విమానం అస్థిరంగా ప్రయాణించడం తాను చూశానని చెప్పారు. కొద్ది సేపటి తర్వాత ఆ ప్రాంతంలో భారీ శబ్దం వెలువడిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. విమానం శకలాలు, ఓ మృతదేహం కాలుతూ కనిపించిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు