Eluru: ‘₹2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం..’ నక్సలైట్ల పేరుతో వ్యాపారికి బెదింపులు!

రూ.2 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తామని నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఏలూరు జిల్లాలోని కైకలూరులో ఈ ఘటన జరిగింది.

Updated : 22 Jul 2023 12:03 IST

కైకలూరు: రూ.2 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తామని నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఏలూరు జిల్లాలోని కైకలూరులో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్సలైట్ల పేరుతో కైకలూరు వ్యాపారి ప్రసాద్‌రాజుకు నిందితులు నాలుగు రోజులుగా బెదిరింపు ఫోన్‌కాల్స్‌ చేశారు. రూ.2 కోట్లు ఇవ్వాలని.. లేదంటే చంపేస్తామన్నారు. ఈ బెదిరింపులపై మూడు రోజుల కిందట ప్రసాద్‌రాజు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రసాద్ రాజు ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులు తోకల ఏసేబు, శీలం హేమంత్‌కుమార్‌, చిన్నం పెద్దబాబును.. కైకలూరు పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు మాణిక్‌రావు పరారీలో ఉన్నాడు. మాణిక్‌రావు, ఏసేబు గతంలో ప్రసాద్‌రాజు వద్ద డ్రైవర్లుగా పని చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని