Delhi: దారివ్వాలని కారు హారన్ మోగించినందుకు మహిళపై దాడి!
గుడ్గావ్లో రోడ్డుపై దారివ్వమని కారు హారన్ మోగించిన మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో సదరు మహిళ ఎడమ కన్ను, ముక్కుపై గాయాలైనట్లు తెలిపింది.
దిల్లీ: దేశ రాజధానిలో మహిళలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం మహిళను కారుతో ఈడ్చుకెళ్లిన ఉదంతం మరవకముందే.. గురువారం దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ను కారుతో కొన్నిమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా హారన్ కొట్టారనే కారణంతో కారులో వెళుతున్న మహిళను ఆపి నడిరోడ్డులో ఆమెపై దాడికి పాల్పడిన ఘటన గుడ్గావ్ ఎమ్డీఐ చౌక్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుడ్గావ్కు చెందిన ఓ మహిళ ఆర్థికసేవలకు సంబంధించిన ఓ సంస్థలో పనిచేస్తోంది. బుధవారం రాత్రి ఆమె కారులో వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఆమె వాహనాన్ని ఓవర్టేక్ చేసి దారికి అడ్డుగా ఆగింది. అందులోంచి దిగిన ఓ వ్యక్తి బాధిత మహిళను కారు నుంచి బయటకు లాగి పలుమార్లు ఆమె చెంపపై కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మరోసారి ఇంటికి వచ్చి కొడతానని , చంపేస్తానంటూ సదరు వ్యక్తి బెదిరించినట్లు ఆమె తెలిపింది. రోడ్డుపై వెళుతున్న సమయంలో దారివ్వాలని కారు హారన్ మోగించింనందుకే సదరు వ్యక్తి తనపై నడిరోడ్డులో దాడి చేసినట్లు వాపోయింది. ఈ ఘటన చూసిన కొందరు వ్యక్తులు అక్కడి రావడంతో ఆ వ్యక్తి ఘటనా స్థలం పరారైనట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. దాడిలో తన ఎడమ కన్ను, ముక్కుపై గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుర్తితెలియని వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు!
వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. -
ప్రేమను అంగీకరించలేదని అమ్మకు విషం పెట్టిన యువతి
తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్ రైస్లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు. -
గురుగ్రంథ్ సాహిబ్లో పేజీల చించివేత.. యువకుణ్ని కొట్టిచంపిన స్థానికులు
సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. -
కుమారుణ్ని కొట్టిచంపి.. గోనెసంచిలో చుట్టి పడేశారు!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్ విమానాశ్రయ పోలీస్స్టేషను పరిధిలో ఏప్రిల్ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. -
నూహ్ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. -
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.