Insta Reels: ఆ ఇన్స్టా రీల్.. ఆమె కొంపముంచింది
వినోదం కోసం పక్కదారి పట్టింది ఆ ఇన్స్టాగ్రామర్. సరిగ్గా రెడ్ సిగ్నల్ పడినప్పుడు జీబ్రా క్రాసింగ్ మీదకు వచ్చి చిందులేసింది. ఆ వీడియోను కాస్త ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయినా.. చివరకు ఆమెను చిక్కుల్లో పడేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వినోదం కోసం పక్కదారి పట్టిందామె. సరిగ్గా రెడ్ సిగ్నల్ పడినప్పుడు జీబ్రా క్రాసింగ్ మీదకు వచ్చి చిందులేసింది. ఆ వీడియోను కాస్త ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయినా.. చివరకు ఆమెను చిక్కుల్లో పడేసింది. వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన శ్రేయా కల్రా రీల్స్ చేయడమంటే అమితమైన ఆసక్తి. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 2లక్షలపైగా ఫాలోవర్స్ ఉన్నారు. అభిమానులు చేయమన్న డేర్ ఛాలెంజ్ రీల్స్ని చేస్తుంటుంది. తాజా రెడ్ సిగ్నల్ పడినప్పుడు జీబ్రా క్రాసింగ్ మీదకు వచ్చి స్టెపులేసింది. అంతేకాదు..‘‘రూల్స్ బ్రేక్ చేయకండి- రెడ్ సిగ్నల్ వద్ద మీరు ఆగిపోవాలి ఎందుకంటే నేను డ్యాన్స్ చేస్తున్నాను కాబట్టి. మాస్కులు ధరించండి’’ అంటూ తన పోస్టు కింద రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె చేష్టలకు వ్యతిరేకించారు. ఇదికాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో సోషల్మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రూల్స్ అతిక్రమించి మరీ రీల్స్ చేస్తున్న వారందికీ చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇకపై అలాంటి వీడియోలు చేయకండంటూ హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..