మహిళ దారుణ హత్య
గుర్తుతెలియని వ్యక్తులు మహిళ నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసిన ఘటన వికారాబాద్ సమీపంలోని ఆలంపల్లి-గెరిగేట్పల్లి రైల్వే వంతెన సమీపం..
వికారాబాద్ గ్రామీణం: గుర్తుతెలియని వ్యక్తులు మహిళ నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసిన ఘటన వికారాబాద్ సమీపంలోని ఆలంపల్లి-గెరిగేట్పల్లి రైల్వే వంతెన సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వికారాబాద్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరూర్ మండలం హౌసుపల్లికి చెందిన అమృతమ్మ(38) అడ్డాకూలీ. గురువారం వికారాబాద్కు పనికోసం వచ్చిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆమె రాక కోసం ఎదురుచూసి ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వికారాబాద్ పరిసర ప్రాంతాలు, తెలిసిన వారి ఇళ్లల్లో గాలించారు. ఆయినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె భర్త చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట అదృశ్యం కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం రైల్వే వంతెన వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అమృతమ్మదిగా గుర్తించారు. నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్సై హత్య
ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు యత్నించిన ఏఎస్సైను ట్రాక్టరుతో తొక్కించి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. -
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీల మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. -
ఉద్యోగం రాదన్న బెంగతో యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదన్న బెంగతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో చోటుచేసుకుంది. -
అన్నయ్య ప్రాణాలు తీసిన చెల్లి
అబ్బాయిలతో మొబైల్ ఫోన్లో మాట్లాడొద్దని మందలించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య(18)ను గొడ్డలితో నరికి హత్య చేసింది. -
‘స్టాక్ ట్రేడింగ్’.. మోసాలు లోడింగ్!
‘స్టాక్ ట్రేడింగ్’లో సహకరిస్తామని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. ఈ మోసగాళ్ల బారినపడి తెలంగాణలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారు. -
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
తన ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే ఓ నదిలో విసిరేసిందో తల్లి. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.