Nirmal: ఖానాపూర్లో దారుణం.. నడిరోడ్డుపై యువతి హత్య
నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.
ఖానాపూర్: నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. జిల్లాలోని ఖానాపూర్ పరిధి శివాజీనగర్లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. యువతి అలేఖ్య (22), యువకుడు శ్రీకాంత్ గతంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇంట్లో విషయం తెలియడంతో యువతి కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు. నాలుగు నెలల క్రితం వేరే వ్యక్తితో ఆమెకు వివాహం నిశ్చయించారు. పెళ్లి నిశ్చయించుకున్న వారికి ఫోన్ చేసి అమ్మాయి, తాను ప్రేమించుకుంటున్నామని చెప్పి వివాహం జరగకుండా చేశాడు. ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలను పీఎస్కు పిలిపించిన పోలీసులు.. యువతిని ఇబ్బంది పెట్టొద్దని యువకుడిని హెచ్చరించారు. దీంతో కసి పెంచుకున్న శ్రీకాంత్.. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం టైలరింగ్ శిక్షణ తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో వెనకనుంచి కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన ఆమె వదిన, రెండేళ్ల చిన్నారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి రియాన్ష్ తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో నిర్మల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ మోహన్, ఎస్ఐ లింబాద్రి పరిశీలించారు. హత్య చేసిన తర్వాత పరారైన నిందితుడి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
జిల్లాలోని కర్నూలు మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు ట్రాన్స్జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. -
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లింట తీవ్ర విషాదం
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. -
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
బస్సులో 9 మంది సజీవ దహనం
హరియాణాలోని నూహ్ జిల్లా ధులావత్ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్- పల్వాల్(కేఎంపీ) ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!