Telangana news: డీజే ప్రాణం తీసిందా?.. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ మహిళ మృతి
ఉత్సాహంగా బంధువు వివాహ ఊరేగింపులో నృత్యం చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఓ మహిళ ఆసుపత్రిలో మృతి చెందిన ఘటన గురువారం అర్ధరాత్రి నగర శివారు అల్లీపురంలో చోటుచేసుకుంది.
ఖమ్మం అర్బన్: ఉత్సాహంగా బంధువు వివాహ ఊరేగింపులో నృత్యం చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఓ మహిళ ఆసుపత్రిలో మృతి చెందిన ఘటన గురువారం అర్ధరాత్రి నగర శివారు అల్లీపురంలో చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే పెనుగూరి రాణి(30) గురువారం చింతకాని మండలం సీతంపేటలో బంధువు వివాహ వేడుకలో కుటుంబంతో కలిసి పాల్గొంది. పెళ్లి కొడుకుతో తిరిగి ఇంటికి వస్తూ అల్లీపురంలో జరిగిన ఊరేగింపులో ఉత్సాహంగా నృత్యం చేసింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయిన ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. డీజే శబ్ధాల ధాటికి ఆమె బ్రెయిన్ స్ట్రోక్కు గురైనట్లు వైద్యులు తెలిపారని బంధువులు చెప్పారు. రాణి స్వగ్రామం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం. దివ్యాంగుడైన భర్త ఉప్పలయ్య, కుమార్తెలు అమూల్య, అంజలితో కలిసి తన పుట్టిల్లు అల్లీపురంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. రాణి మృతితో కుమార్తెలు ఆదరవు కోల్పోయారని బంధువులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్సై హత్య
ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు యత్నించిన ఏఎస్సైను ట్రాక్టరుతో తొక్కించి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. -
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీల మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. -
ఉద్యోగం రాదన్న బెంగతో యువకుడి ఆత్మహత్య
ఉద్యోగం రాదన్న బెంగతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో చోటుచేసుకుంది. -
అబ్బాయిలతో ఫోను మాట్లాడొద్దని మందలించినందుకు.. అన్నయ్య ప్రాణాలు తీసిన చెల్లి
అబ్బాయిలతో మొబైల్ ఫోన్లో మాట్లాడొద్దని మందలించాడన్న కోపంతో 14 ఏళ్ల బాలిక తన అన్నయ్య(18)ను గొడ్డలితో నరికి హత్య చేసింది. -
‘స్టాక్ ట్రేడింగ్’.. మోసాలు లోడింగ్!
‘స్టాక్ ట్రేడింగ్’లో సహకరిస్తామని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. ఈ మోసగాళ్ల బారినపడి తెలంగాణలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారు. -
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
తన ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే ఓ నదిలో విసిరేసిందో తల్లి. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.