వీరి చేతులు అద్భుతాలు చేస్తున్నాయ్..!
చిన్నప్పటి నుంచి కళల్లో ఉన్న నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పదునుపెడుతూ తాము ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వారు గీసే చిత్రాలైనా, చేసే బొమ్మలైనా చూస్తే ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. తీక్షణంగా చూస్తే తప్ప అవి
అభిరుచితో గుర్తింపు పొందిన యువత
మామడ/నిర్మల్ పట్టణం, న్యూస్టుడే
చిన్నప్పటి నుంచి కళల్లో ఉన్న నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పదునుపెడుతూ తాము ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వారు గీసే చిత్రాలైనా, చేసే బొమ్మలైనా చూస్తే ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. తీక్షణంగా చూస్తే తప్ప అవి రంగులద్దుకున్నవని గుర్తించరు. ఇలా తమ ప్రతిభతో అందరిచే ఔరా అనిపించుకుంటున్న యువతపై ‘న్యూస్టుడే’ కథనం.
రమణీయ గీత.. : రమణిత
నర్సాపూర్ (జి) మండలకేంద్రానికి చెందిన రమణిత అందరికీ సుపరిచితురాలవడానికి కారణం ఆమెలోని కళనే. బొమ్మలు గీయడం, జానపద పాటలు పాడటం, లఘుచిత్రాల్లో నటించడం, నృత్యం, పల్లె సన్నివేశాలను ప్రతిబింబించే కార్యక్రమాలతో రాణిస్తోంది. యూట్యూబ్లో ఆ యువతి ప్రతిభకు ఎంతో ఆదరణ లభిస్తోంది. పల్లెటూరిలో పుట్టి సొంతంగా కళకు పదునుపెట్టి దినదినాభివృద్ధి చెందుతోంది. పట్టుదలతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా, ఎవరైనా రాణించొచ్చని రుజువు చేస్తోంది.
చమక్కుమనేలా.. : చెర్రీ
ఖానాపూర్ పట్టణానికి చెందిన చెర్రీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందాడు. చిన్నప్పటి నుంచి రంగులు, బొమ్మలపై ఉన్న ఆసక్తితో చిత్రలేఖనంలో మెలకువలు అభ్యసించి నైపుణ్యం సాధించాడు. అందమైన బొమ్మలు గీస్తూనే ఆకట్టుకునే నటనతో మెప్పించగలడు. ఇటీవల విడుదలైన అర్ధశతాబ్దం, అర్జున్ చక్రవర్తి సినిమాల్లో నటించి ప్రశంసలందుకున్నాడు. మంచి నృత్యకారుడిగానూ రాణిస్తున్నాడు.
మట్టితో బొమ్మలు.. బరికుంట అజయ్
నర్సాపూర్(జి)కి చెందిన బరికుంట అజయ్కు చిన్నప్పటి నుంచి బొమ్మల తయారీ అంటే మక్కువ. చూసిన ఏ వస్తువునైనా అచ్చుగుద్దినట్లు తయారుచేయడంలో దిట్ట. సొంతంగా నేర్చుకొని రాణిస్తున్నారు. ఏటా వినాయకచవితి, దుర్గ నవరాత్రుల సమయంలో గణపతి, అమ్మవారి విగ్రహాలను చక్కగా తీర్చిదిద్దుతాడు. పర్యావరణ పరిరక్షణతో పాటు మంచి కళను ప్రదర్శిస్తూ అందరిలో గుర్తింపు పొందారు.
ఆయన ప్రతిభ.. ‘నమ్మలేనంత’.. : అబ్దుల్ రాయబోస్
కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ రాయబోస్ ప్రతిభను మాటల్లో వర్ణించలేం. తమిళనాడులో బీఎఫ్ఏ పూర్తిచేశారు. ఆయన కుంచె నుంచి జాలువారిన చిత్రాలు నిజమైనవాటికి ఏమాత్రం తీసిపోవు. చాయ్- బిస్కట్, బ్రెడ్, మొక్కజొన్న కంకి, నాణేలు, కూరగాయలు.. తదితర వస్తువులు, పదార్థాల బొమ్మలను ప్రదర్శిస్తే అవి చిత్రాలని నమ్మడానికి సమయం పడుతుంది. ఇప్పటికే పలు ప్రదర్శనల్లో స్థానం పొందిన ఆయన చిత్రకళతో పలు పురస్కారాలు దక్కించుకోవడం విశేషం.
అచ్చుగుద్దినట్లుగా.. : సందేశ్
భైంసా మండలం పేండ్పెల్లి గ్రామానికి చెందిన సందేశ్ కర్ణాటకలో బీఎఫ్ఏ పూర్తిచేశాడు. చిన్నప్పటి కళకు అక్కడ మెరుగులద్దుకున్నాడు. ఎదురుగా ఉన్న మనిషిని చూస్తూ ఇట్టే ఆయన చిత్రాన్ని అచ్చుగుద్దినట్లుగా గీసేస్తాడు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి బొమ్మను గీసి ఆయనకు అందజేశారు. ఊహించని కానుకను చూసి కలెక్టర్ కాసేపు మైమర్చిపోయారు. ఆ యువకుడిని ప్రత్యేకంగా అభినందించారు. చిత్రకళనే కాకుండా పురాతన వస్తువుల సేకరణలోనూ సందేశ్ ప్రత్యేకతను చాటుతున్నాడు.
సహజసిద్ధంగా.. : గుండోజు సంతోష్
ప్రకృతిలో కనువిందు చేసే ప్రతీ అంశాన్ని ప్రతిబింబించే చిత్ర విచిత్రాలకు సంతోష్ జీవం పోస్తాడు. నర్సాపూర్ (జి)కి చెందిన ఈ యువకుడు గీసిన చిత్రాలు, తయారుచేసిన బొమ్మలు మ్యూజియాన్ని తలపిస్తాయి. గాల్లో తేలియాడుతున్నట్లు, ఆకాశంలో వేలాడుతున్నట్లు భ్రమింపజేసేలా కళాకృతులను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాడు. సమకాలీన అంశాలను, సందేశాత్మక విషయాలను సందర్భానుసారం తన చిత్రాలతో జనాలకు చేరవేస్తుంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాస్త్రీయ కళలు ఈ తరానికి అందించడం అభినందనీయం
[ 27-04-2024]
కనుమరుగవుతున్న భారతీయ శాస్త్రీయ కళలను ఈ తరానికి అందించడం అభినందనీయమని న్యాయమూర్తి క్షమా దేశ్ పాండే, ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్ అన్నారు. -
అంతర్ రాష్ట్ర రహదారిపై భాజపా నాయకుల రాస్తారోకో
[ 27-04-2024]
పొన్నారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రహదారి, ఇళ్లపై ఏర్పాటుచేసిన కాషాయరంగు జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. -
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే