10,489 మందికి ఎన్నికల విధులు
లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కోసం అంతా సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే ఉద్యోగ, ఉపాధ్యాయ సమాచార సేకరణ, కంప్యూటర్లో వారి వివరాల నిక్షిప్తం చేసే ప్రక్రియను పూర్తి చేశారు.
న్యూస్టుడే, ఆదిలాబాద్ పాలనాప్రాంగణం
లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కోసం అంతా సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే ఉద్యోగ, ఉపాధ్యాయ సమాచార సేకరణ, కంప్యూటర్లో వారి వివరాల నిక్షిప్తం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ వేదికగా జిల్లాల వారీగా 55 శాఖల నుంచి ఉద్యోగుల సమాచారం తెప్పించి కంప్యూటర్లో క్రోడీకరించారు. ఆయా ఉద్యోగులకు ఎన్నికల సంఘం నుంచి సందేశాలు రావడం మొదలైంది.
ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో విధులు నిర్వహించాల్సిన ఎన్నికల ఉద్యోగుల సమాచారం సేకరణ పూర్తయ్యింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాలను గుర్తించారు. పార్లమెంటు పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 10,489 మంది ఉద్యోగులు అవసరమని గుర్తించారు. ఈ మేరకు వారికీ విధులు సందే10,489 మందికి ఎన్నికల విధులు ఉద్యోగ సమాచార సేకరణ పూర్తి శాలు నేరుగా ఎన్నికల సంఘం నుంచి వస్తున్నాయి.
55 శాఖలు.. 45 రకాల సమాచారం
దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కావడంతో అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. అత్యవసర విభాగాలైన వైద్యం, ఆబ్కారీ, రవాణా, అగ్నిమాపక, పోలీసు విభాగాలు మినహా ఎన్నికల నిర్వహణకు 55 శాఖల ఉద్యోగులు ఈ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు కానున్నారు. పీవో, ఏపీవో, ఓపీవోల కోసం ఆయా శాఖల్లో పని చేస్తున్న వారి వివరాలను సేకరించారు. బేసిక్పేను బట్టి ఎవరిని పీవోగా, ఏపీవోగా, ఓపీవోగా నియమించాలో కూడా కార్యాచరణ సిద్ధం చేసి పెట్టారు. శాఖలవారీగా వచ్చిన సమాచారం సరైందా? కాదా? అని కూడా వ్యక్తిగతంగా ఫోన్లు చేసి తెలుసుకోగా.. తాజాగా ఎన్నికల సంఘం సైతం ఫిబ్రవరి 8న విడుదలైన ఓటరు తుది జాబితా ప్రకారం ఉద్యోగుల ఎపిక్ నెంబరు సహాయంతో పార్ట్నెంబరు, సీరియల్ నెంబరు, పని చేస్తున్న నియోజకవర్గం, ఓటు వినియోగించుకోవాల్సిన నియోజకవర్గంతో పాటు చరవాణి నెంబరుతో కూడిన సందేశాలు సరైనవా కావా? కూడా మరోమారు ఆరా తీయడం ఎన్నికల నిర్వహణ ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారో స్పష్టమవుతోంది.
పోలింగ్ కేంద్రానికి నలుగురు చొప్పున
ప్రతి పోలింగ్ కేంద్రానికి నలుగురు చొప్పున సిబ్బందిని నియమిస్తూ.. అదనంగా మరో 20 శాతం మంది ఉద్యోగులను రిజర్వులో ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేశారు. నియోజకవర్గం వారీగా పోలింగ్ కేంద్రాలు, అందుబాటులో ఉన్న సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి.
ఫోన్లు చేస్తూ..
ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 45 రకాల వివరాలను సేకరించారు. పుట్టిన తేదీ మొదలుకొని, తీసుకునే మూలవేతనం, సొంత నియోజకవర్గం, పని చేస్తున్న జిల్లా, ఎపిక్ నెంబరు, పోలింగ్ కేంద్రం, చరవాణి నెంబరు వంటి వ్యక్తిగత సమాచారం క్రోడికరిస్తూ.. ప్రతి ఒక్కరికి ఫోన్లు చేస్తూ సమాచారాన్ని ధ్రువీకరించారు.
ఎన్నికల సంఘం నుంచి సందేశాలు
అధికార యంత్రాంగం సేకరించిన వివరాలల్లో ఏవైనా పొరపాట్లు దొర్లితే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారులను కలవాలంటూ నేరుగా ఎన్నికల సంఘం నుంచి ఇలాంటి సందేశాలు ఉద్యోగులకు వస్తున్నాయి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ ఓటును వినియోగించుకునేలా ఆయా సందేశాలతో జాగ్రత్తలు తీసుకుంటోంది ఎన్నికల సంఘం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాస్త్రీయ కళలు ఈ తరానికి అందించడం అభినందనీయం
[ 27-04-2024]
కనుమరుగవుతున్న భారతీయ శాస్త్రీయ కళలను ఈ తరానికి అందించడం అభినందనీయమని న్యాయమూర్తి క్షమా దేశ్ పాండే, ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్ అన్నారు. -
అంతర్ రాష్ట్ర రహదారిపై భాజపా నాయకుల రాస్తారోకో
[ 27-04-2024]
పొన్నారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రహదారి, ఇళ్లపై ఏర్పాటుచేసిన కాషాయరంగు జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. -
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే