logo

టీటీజీడీఏ కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Published : 28 Mar 2024 19:56 IST

ఎదులాపురం: తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ రెగ్యులర్ వైద్యులు కార్యవర్గంలో రెండేళ్ల కాల పరిమితితో ఎన్నికలను.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ విజయసారథి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా శ్యాంప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కస్తూరి శ్రీనివాస్, కోశాధికారిగా కమలాకర్ ఎన్నికయ్యారు. అదే విధంగా కార్యనిర్వాహక సభ్యులను సైతం ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి రిమ్స్ అధ్యాపకవర్గం శుభాకాంక్షలు తెలిపి అభినందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని