ఇక విద్యుత్తు కోతలకు చెక్
ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం...
ఓవర్లోడ్ ప్రాంతాల్లో నియంత్రికల ఏర్పాటు
పట్టణంలో ఏర్పాటు చేస్తున్న నియంత్రిక
ఆదిలాబాద్ వ్యవసాయం, న్యూస్టుడే: ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోవోల్టేజీ, ఓవర్లోడ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి నియంత్రికల సామర్థ్యం పెంచేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మండలాలవారీగా ప్రస్తుతం ఉన్న నియంత్రికలు, విద్యుత్తు వినియోగం, కనెక్షన్లు తదితర వివరాలు సేకరించడంతోపాటు నియంత్రికల అవసరాన్ని గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో 2.67 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉండగా ఇందులో గృహావసరాలకు సంబంధించిన కనెక్షన్లు 2.04 లక్షలు ఉన్నాయి. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వాడకం ఎక్కువైంది. వ్యవసాయరంగంతోపాటు, పరిశ్రమలకు ఒకేసారి విద్యుత్తు అవసరం ఏర్పడటంతో ఓవర్లోడ్ కారణంగా నియంత్రికలు, ఫ్యూజులు కాలిపోతున్నాయి. జనవరి నెల వినియోగం 46.79 మిలియన్ యూనిట్లు ఉండగా ఫిబ్రవరి నెల వచ్చే సరికి 50 మిలియన్ యూనిట్లుకు చేరుకుంది. ఈ నెలలో 52 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో ఓవర్లోడ్ ప్రాంతాలను గుర్తించి అదనపు నియంత్రికలు ఏర్పాటు చేస్తున్నారు.
20 చోట్ల గుర్తింపు..
జిల్లా మొత్తంలో ఇప్పటికే 20 నియంత్రికలు ఓవర్లోడ్లో ఉన్నట్లు గుర్తించి వాటిని మార్చే పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 15, పట్టణంలో 5 నియంత్రికలు కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని రెండు ప్రాంతాల్లో 100 కేవీ నియంత్రిక స్థానంలో 160 కేవీ నియంత్రికలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫ్యూజులు సరిగా లేని చోట కొత్తవి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతంలో అంకోలి, తంతోలి, యాపల్గూడ, సిరికొండ తదితర ప్రాంతాల్లో 15 కేవీ సామర్థ్యం ఉన్న నియంత్రికల స్థానంలో 25 కేవీ నియంత్రికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో అయిదు నియంత్రికలకు ప్రతిపాదనలు పంపించడంతో మంజూరు అయినట్లు వివరించారు.
అంతరాయం కలిగితే ఫోన్ చేయొచ్చు
విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే సమాచారం అందించేందుకు వీలుగా నియంత్రికలపై లైన్మెన్ చరవాణి నంబర్లు రాయించారు. అయిదు పది నిమిషాలకంటే ఎక్కువ సేపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే సంబంధిత లైన్మెన్కు ఫోన్ చేస్తే కారణం తెలియచేయడంతోపాటు వెంటనే సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు.
తగిన చర్యలు తీసుకుంటున్నాం
జైవంత్రావు చౌహాన్, ఎస్ఈ, ఆదిలాబాద్
జిల్లాలో అన్ని రంగాలకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటికే ఓవర్లోడ్ ఉన్న ప్రాంతాలను గుర్తించాం. అవసరమైన ప్రాంతాల్లో కొత్త నియంత్రికలు ఏర్పాటు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో పనులు పూర్తి చేస్తారు. కొన్ని చోట్ల ఇప్పటికే మార్చేశారు. 33 కేవీ లైన్ వెంట ఉండే అంతరాయాలను సైతం తొలగించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగితే ప్రధాన కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేశాం. సమాచారం ఇస్తే వెంటనే సంబంధిత లైన్మెన్కు సమాచారం ఇచ్చి బాగు చేయించేలా చర్యలు తీసుకున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
[ 27-04-2024]
మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని షీ టీం బాధ్యురాలు బి.సుశీల సూచించారు. -
అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
[ 27-04-2024]
స్థానిక సుదరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం-1లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సబిత ముఖ్యఅధితిగా హజరై, పిల్లలకు అభివృద్ధి పత్రాలు అందించారు. -
శాస్త్రీయ కళలు ఈ తరానికి అందించడం అభినందనీయం
[ 27-04-2024]
కనుమరుగవుతున్న భారతీయ శాస్త్రీయ కళలను ఈ తరానికి అందించడం అభినందనీయమని న్యాయమూర్తి క్షమా దేశ్ పాండే, ప్రముఖ వైద్యుడు అశోక్ కుమార్ అన్నారు. -
అంతర్ రాష్ట్ర రహదారిపై భాజపా నాయకుల రాస్తారోకో
[ 27-04-2024]
పొన్నారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రహదారి, ఇళ్లపై ఏర్పాటుచేసిన కాషాయరంగు జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. -
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM