logo

ఆశాలతో స్ఫుటం డబ్బాలు మోయించడం సరికాదు

ఆశా కార్యకర్తలతో స్ఫుటం డబ్బాలు మోయించడం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న అన్నారు.

Updated : 16 Apr 2024 14:55 IST

ఎదులాపురం: ఆశా కార్యకర్తలతో స్ఫుటం డబ్బాలు మోయించడం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న అన్నారు. ఈ విషయమై ఆశాల సంఘం ఆధ్వర్యంలో క్షయ నివారణ కార్యక్రమ అధికారి సాయి ప్రియకు వినతి పత్రం అందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు స్ఫుటం డబ్బాల గురించి టార్గెట్ పెట్టి ఆశాలని ఇబ్బంది పెడుతున్నారన్నారు.  టార్గెట్ పూర్తి కాకపోతే జీతాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో సేకరించిన  స్ఫుటం డబ్బాల డబ్బులు 3 సంవత్సరాలవి పెండింగ్ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి,ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి సుజాత, ఆశా యూనియన్ నాయకులు పలువురు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని