నీటిబొట్టు.. ఒడిసిపట్టి
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
తీరుతున్న వన్యప్రాణుల దాహార్తి
ర్యాంపువెల్
జన్నారం, న్యూస్టుడే: జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మండుతున్న ఎండలకు మనుషులే తాగునీటికి అల్లాడిపోతున్నారు. అలాంటిది దట్టమైన అడవిలో ఎండిపోయిన చెట్ల మధ్య అగ్ని గుండాన్ని తలపిస్తున్న వేడిలోనూ వన్యప్రాణులకు తాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నారు. జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని తాళ్లపేట రేంజి అధికారిణి సుష్మారావు రోజూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. అనేక చోట్ల ఉన్న కుంటలు, చెరువులను పరిశీలిస్తూనే మరో అయిదు ర్యాంపు వెల్్్స తవ్వించారు. సాసర్ పిట్స్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు.
కవ్వాల్ పులులు సంరక్షణ కేంద్రం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న గుట్టల నుంచి సహజ సిద్ధమైన నీటి ఊటలు ఉబికి వస్తున్నాయి. ఆ నీటిని నిల్వ చేయడానికి చెలమలు తవ్వించారు. ఆ నీటిలో రాలిపడే ఎండిపోయిన ఆకులను బేస్ క్యాంపు సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు. దీంతో అటుగా వెళ్లే వన్యప్రాణులు చల్లని నీటిని తాగుతున్నాయి. తాగునీటి కోసం అడవిని వీడాల్సిన పనిలేకుండా పోయింది. తాళ్లపేట రేంజి పరిధిలోని దండేపల్లి, ఊట్ల, నీలాలొద్ది, కోతులగుండం, మహ్మదాబాద్, తుంగమడుగు, తపాల్పూర్, చినగుట్ట, ముత్యంపేట, మామిడిలొద్ది, చిగుర్ల ప్రాంతాల్లో సహజసిద్ధమైన నీటి వనరులున్నాయి.
నిండుగా ఉన్న కుంటలు
అడవి మధ్యలో తవ్వించిన కుంటల్లో నీళ్లు ఇప్పటికీ నిండుగానే ఉంటున్నాయి. చెరువులు, కుంటల్లో ఏటా పూడిక తీసి అందులో నీళ్లు నిలిచేలా చేస్తున్నారు. వర్షపు నీరు కుంటల్లోకి చేరుకొని నిండుకుండను తలపిస్తున్నాయి. ఎత్తైన ప్రాంతంలో కురిసే ప్రతి చినుకు బొట్టు కుంటలు, చెరువుల్లోకి ప్రవహించి జలకళను సంతరించుకున్నాయి. ప్రతి సెక్షన్లోనూ చెరువులు, కుంటలు ఉన్నాయి. సోలార్ పిట్స్, సాసర్ వెల్స్, ర్యాంపు వెల్స్ రేంజి పరిధిలో నిండు కుండలను తలపిస్తున్నాయి.
సహజసిద్ధ నీటి ఊట ద్వారా వస్తున్న జలం
అయిదు ర్యాంపు వెల్స్ తవ్వించాం
సుష్మారావు, రేంజి అధికారిణి, తాళ్లపేట
తాళ్లపేట రేంజి పరిధిలో నీటి ఎద్దడి నివారణకు ఈ ఏడాది అయిదు ర్యాంపువెల్స్ తవ్వించాను. దీంతో ప్రస్తుతం ఇక్కడ 10 ర్యాంపు వెల్్్స ఉన్నాయి. ప్రతి సాసర్ పిట్లోనూ ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నాం. ఏ ఒక్క వన్యప్రాణి దాహంతో అల్లాడి పోయే ప్రసక్తే లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నా. ప్రతి నీటి బొట్టును నిలువ చేసేలా చర్యలు చేపడుతున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హజ్ యాత్రికులకు టీకా కార్యక్రమం
[ 02-05-2024]
ఈ ఏడాది జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు స్థానిక టీఎన్జీవో భవనంలో ఆరోగ్య పరీక్షలను ... -
సీపీఎం పార్లమెంట్ స్థాయి సమావేశం జయప్రదం చేయండి
[ 02-05-2024]
సీపీఎం పార్టీ పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశం 3న స్థానిక యాదవ సంఘ భవనంలో నిర్బహించనున్నట్లు ... -
మండలంలో భాజపా ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
తాంసి మండలంలోని వడ్డాడిలో గురువారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
మండలంలోని హస్నాపూర్, వడ్డాడి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పొన్నారిలో భారాస ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
తాంసి మండలం పొన్నారిలో గురువారం భారాస నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 02-05-2024]
పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఠాకూర్ హోటల్ వద్ద మురుగు కాలువలో గుర్తు తెలియని మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. -
శ్రేణులకు నిర్దేశం.. జనజాతరకు సిద్ధం
[ 02-05-2024]
ఆదిలాబాద్లో ఏప్రిల్ 22న ఇప్పటికే జనజాతర సభ పేరిట ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆసిఫాబాద్లో జన జాతర సభ నిర్వహిస్తున్నారు. -
రైస్ మిల్లులకు తాళాలు..
[ 02-05-2024]
జిల్లాలో రైస్ మిల్లుల బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. పోలీసుల కేసు నమోదుతో రైస్ మిల్లులకు తాళాలు వేసి వ్యాపారులు పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క అవకాశం కోసం అడుగుతున్నాం : మంత్రి సీతక్క
[ 02-05-2024]
‘ఆదిలాబాద్ నుంచి తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ, సామాన్య మహిళను పార్లమెంటుకు పంపిద్దాం.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అన్ని జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని..’ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ఓపీ చీటీ తీసుకోవటం మరింత సులువు
[ 02-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఓపీ(అవుట్ పేషెంట్) చీటీ తీసుకోవటానికి రోగులు, వారి సహాయకులు ఇక నుంచి గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదు. -
బరిలో 42 మంది.. బ్యాలెట్ యూనిట్లు
[ 02-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుస్థానానికి 42 మంది పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరముంది. -
ఆర్టీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్కు నిరీక్షణ
[ 02-05-2024]
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల నోటిఫికేషన్ కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆర్జీయూకేటీలో నేరుగా ప్రవేశాలు పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. -
పని ప్రదేశమే.. ప్రచార వేదిక
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మండుటెండల్లో వచ్చాయి. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల దృష్ట్యా తెల్లవారంగానే పలుగు పారబట్టి పనులకు వెళుతున్నారు. -
అగ్నిగోళంగా ఆదిలాబాద్
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో బుధవారం సగటు ఉష్ణోగ్రత 42.9 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. గత నెలలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందారు. -
ముల్లె సదురుకున్నాం.. ఎల్లి పోతావున్నాం!
[ 02-05-2024]
‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కో.. ముల్లె సదురుకున్నా.. ఎల్లి పోతావున్నా.. ఈ ఊళ్లో నాకింక ఏమున్నదక్కో’ అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన గేయం ఇక్కడి ఆదివాసీలకు సరిగ్గా సరిపోతోంది. -
పర్యవేక్షణ బరువు.. వ్యవ‘సాయం’కరవు
[ 02-05-2024]
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎరువుల దుకాణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా పురుగుమందులను అన్నదాతలకు అంటగడుతున్నారు. -
మద్యం వ్యాపారుల.. ‘మిలాఖత్’!
[ 02-05-2024]
మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి కల్తీ, నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మాటల వేఢీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తూ పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. -
తెల్లవారుజామున ఎస్ఈ బదిలీ ఉత్తర్వులు
[ 02-05-2024]
విద్యుత్తు సంస్థ జిల్లా ఎస్ఈ రాథోడ్ శేషారావు ఆకస్మిక బదిలీ అయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని బుధవారం తెల్లవారుజామున ఉత్తర్వులు వచ్చాయి. -
మీటరు గిరగిర..
[ 02-05-2024]
సూర్యుడి ప్రతాపంతో జిల్లాలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వేడి కారణంగా ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. -
ఎట్టకేలకు హస్తం గూటికి..
[ 02-05-2024]
నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీ, మరో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎట్టకేలకు బుధవారం భారాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. -
భానుడి భగభగలు.. జనం బెంబేలు
[ 02-05-2024]
వేసవితాపంతో అల్లాడి పోతున్నారు జనం. మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
సరిహద్దు చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా
[ 02-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ముథోల్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. -
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
[ 02-05-2024]
ఆడబిడ్డను పోటీ చేస్తున్నా.. ఆదరించి ఆశీర్వదించండి.. అభివృద్ధి చూసి చూపిస్తానని ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు