logo

యువజనోత్సవాల్లో డిగ్రీ విద్యార్థుల ప్రతిభ

జిల్లా కేంద్రం పాడేరులో ఇటీవల జరిగిన యువజనోత్సవాల్లో చింతపల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

Published : 29 Nov 2022 01:18 IST

ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో అధ్యాపకులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం పాడేరులో ఇటీవల జరిగిన యువజనోత్సవాల్లో చింతపల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఏకపాత్రాభినయంలో ప్రథమ, మోనో యాక్షన్‌లో ద్వితీయ, సాంస్కృతిక నృత్యంలో తృతీయ స్థానాలు సాధించారు. ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో పాల్గొననున్నట్లు ప్రిన్సిపల్‌ బ్రహ్మాచారి తెలిపారు. విద్యార్థులు కళా, సాంస్కృతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులను సోమవారం ప్రిన్సిపల్‌తోపాటు వైస్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివాసపాత్రుడు, పావని, సంతోషి, పున్నారావు, గణేష్‌, ఈశ్వరరావు, రాజబాబు, జగదీష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని