గిరిజన గుమ్మం.. గుమ్మడితో సుసంపన్నం
గిరిజన ప్రాంతాల్లో గుమ్మడి కాయలదే అగ్ర తాంబూలం. గుమ్మడి లేకుండా గిరిజనులు గుమ్మం దాటరనే నానుడి ఉంది. గిరిజనులు వీటిని తమ స్నేహితుల ఇళ్లకు వెళ్లేటప్పుడు తీసుకెళ్తారు.
చింతపల్లి, న్యూస్టుడే: గిరిజన ప్రాంతాల్లో గుమ్మడి కాయలదే అగ్ర తాంబూలం. గుమ్మడి లేకుండా గిరిజనులు గుమ్మం దాటరనే నానుడి ఉంది. గిరిజనులు వీటిని తమ స్నేహితుల ఇళ్లకు వెళ్లేటప్పుడు తీసుకెళ్తారు. తమ ఇంటికి బంధువులు ఎవరైనా వస్తే వారికి గుమ్మడినే బహూకరిస్తారు. ఇది గిరిజన సంప్రదాయంలో శుభసూచికంగా భావిస్తారు. గిరిజనులు పండిన గుమ్మడిని ఏడాది పొడవునా తమ ఇళ్లల్లో నిల్వ చేసి దాచుకుంటారు. దీనికోసం వారు రకరకాల పద్ధతులు ఆచరిస్తుంటారు. ప్రస్తుతం మన్యంలో గుమ్మడికాయలు దిగుబడికి వచ్చాయి. ఒడిశాకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. పది కిలోల బరువుండే కాయ సైతం రూ.50కు మించడం లేదు. మన్యం వారపుసంతల్లో ప్రస్తుతం వీటి అమ్మకాలు జోరందుకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Asha Saini: ఆ నిర్మాత నన్ను హింసించాడు.. ఆశా సైనీ షాకింగ్ కామెంట్స్..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP Govt: ఒకే నెలలో రూ.12 వేల కోట్లకు పైగా అప్పు
-
Politics News
Andhra News: అధికారులపై ప్రజలతో దాడి చేయిస్తా: వైకాపా కౌన్సిలర్ హెచ్చరిక
-
Crime News
Andhra News: బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే జరిమానాలు.. ప్రిన్సిపల్ వేధింపులు
-
Crime News
Andhra News: రూ.87 కోట్ల ఆస్తిని రూ.11 కోట్లకే కొట్టేశారు