విజయ పరంపరకు నాంది పలుకుదాం
ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించి అసెంబ్లీ ఎన్నికల విజయ పరంపరకు నాంది పలకాలని తెదేపా నేతలు పిలుపునిచ్చారు.
తెదేపా మండలి అభ్యర్థి పరిచయంలో నేతలు
చిరంజీవిని సత్కరిస్తున్న బండారు, బుద్ద, పప్పల, కిడారి, ఈశ్వరి
అనకాపల్లి, న్యూస్టుడే: ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించి అసెంబ్లీ ఎన్నికల విజయ పరంపరకు నాంది పలకాలని తెదేపా నేతలు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా తెదేపా కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అధ్యక్షత వహించారు. ముందుగా అభ్యర్థి చిరంజీవిని అందరికీ పరిచయం చేశారు. ఆయనకు శాలువా కప్పి నూకాలమ్మ చిత్రపటం అందించి సత్కరించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలో వాలంటీర్ల మద్దతుతో దొడ్డిదారిన గెలవాలని వైకాపా ప్రయత్నిస్తోందని, దీనిని అడ్డుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీతోపాటు అభ్యర్థి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. అందుకే చంద్రబాబు ఎంతో లోతుగా ఆలోచించి అభ్యర్థిని మార్చారని చెప్పారు. రాజధాని వ్యవహారం న్యాయస్థానంలో ఉండగా ఉగాదికి విశాఖ రాజధాని అంటూ మంత్రులు నోటికొచ్చింది మాట్లాడుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ను ఓడించడానికి ఉద్యోగులు, నిరుద్యోగులు చూస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
సమావేశంలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, మాడుగుల, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జులు పి.వి.జి.కుమార్, ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, నాయకులు బత్తుల తాతయ్యబాబు, జి.మల్లునాయుడు, కోట్ని బాలాజీ పాల్గొన్నారు.
సామాన్య కుటుంబం నుంచి వచ్చా..
అభ్యర్థి చిరంజీవి మాట్లాడుతూ తనను పరిచయం చేసుకున్నారు. ‘రావికమతం మండలం దొండపూడి సొంత ఊరు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడిని. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా ఉద్యోగం చేశాను. పుష్కర కాలం సర్వీసు ఉన్నా స్వచ్ఛంద పదవీ విరమణ చేశానని’ చెప్పారు. తన శిష్యులు అన్ని రంగాల్లో ఉన్నారని తెలిపారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, పటిష్ఠమైన పార్టీ క్యాడర్ సహకారంతో విజయం సాధిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్