విశాఖ ఉక్కుపై.. నష్టాల నెపమా?
ఓ వైపు బొగ్గు కొనలేక ఉత్పత్తి తగ్గిస్తుంటే.. విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందంటూ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇవ్వడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
ఆర్థిక చేయూత దిశగా పడని అడుగులు
పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఇద్దరు వైకాపా ఎంపీలు
గనుల కేటాయింపు, బొగ్గు కొరతపై దృష్టిసారించని వైనం!
ఈనాడు-విశాఖపట్నం
ఓ వైపు బొగ్గు కొనలేక ఉత్పత్తి తగ్గిస్తుంటే.. విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందంటూ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇవ్వడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సమస్య మూలాలపై దృష్టి పెట్టి, ఆర్థిక చేయూత దిశగా అడుగులు వేయకుండా విశాఖ ఉక్కుపై నష్టాల నెపమేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
* ఏపీలో కేంద్ర ప్రభుత్వ రంగంలో నడుస్తోన్న అతిభారీ పరిశ్రమ విశాఖ ఉక్కు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కల్పవృక్షంలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికల్లోనూ ‘విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల దేశవ్యాప్తంగా ఉక్కు రంగంలో 2.1% మేర ఉత్పత్తి తగ్గింది’ అని పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
బొగ్గు కొరత ఓ కారణం: విశాఖ ఉక్కు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 73 లక్షల టన్నులు. ప్రతి రోజూ 21-22 వేల టన్నుల ఉక్కు తయారు చేయడానికి తగ్గ వనరులున్నాయి. కేవలం ముడి సరకు లేకపోవడంతో ఈ ఉత్పత్తి రోజుకు 10-12 వేల టన్నులకు పరిమితమైంది. గతేడాది విశాఖ ఉక్కులో వచ్చిన రూ.950కోట్ల లాభాలను కేవలం బొగ్గు కొనుగోలుకే ఉపయోగించాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో కేంద్రం ఆర్థికంగా చేయూత ఇవ్వాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు వేయలేదు. దేశీయంగా ఉండే బొగ్గు సైతం గత ఏడాదిగా తగినంత సరఫరా సరిగా చేయడంలేదన్న ఆరోపణలున్నాయి. మహానది కోల్హిల్స్ నుంచి టన్ను రూ.3200 వచ్చే బొగ్గు ఇవ్వకపోవడంతో.. రూ.6-15 వేలు ఖర్చు చేసి ఇతర కేంద్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
పాదయాత్రలో హామీ ఇచ్చినా: 2013లో విశాఖ స్టీల్ ప్లాంటుకు గనులు కేటాయించాలని, స్టీల్ అథార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఏఐఎల్)లో కలపాలని రెండు సూచనలు అప్పటి కమిటీ చేసింది. గనుల చట్టం మార్చే ముందు పార్లమెంటరీ కమిటీలు సమావేశమై విశాఖ ఉక్కుకు గనులు కేటాయించే దిశగా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశాయి. అయినా గనుల కేటాయింపు జరగలేదు. విశాఖ ఉక్కు 2007 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.35 వేల కోట్లు ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం)కు అదనంగా ఎన్ఎండీసీ (నేషనల్ మినరల్ డవలెప్మెంట్ కార్పొరేషన్)కు చెల్లించాయి. ఆ నగదు ఎన్ఎండీసీకి లాభాలుగా చూపించి పెద్దపీట వేస్తున్నారే తప్ప, డబ్బులు అదనంగా విశాఖ ఉక్కుతో ఎందుకు ఖర్చు పెట్టించారనే దిశలో కేంద్రం ఆలోచించడం లేదని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అలా ఆలోచించి ఉంటే ఆ సమయంలోనే గనులు కేటాయించి ఉండేవారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా శంకుస్థాపన చేసిన ‘జిందాల్’కు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మైన్స్ (గనులు) అడిగి వచ్చారని, విశాఖ ఉక్కుకు గనులు ఎందుకు అడగడం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. వైకాపా అధికారంలోకి వస్తే ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలతో మాట్లాడి విశాఖ ఉక్కుకు గనులు ఏర్పాటు చేస్తామని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇద్దరు ఎంపీలు సభ్యులైనా...:
పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, రాజ్యసభ సభ్యులు వేంరెడ్డి ప్రభాకర్రెడ్డి, మోపిదేవి వెంకట రమణ నియమితులయ్యారు. అయితే ఈ ఏడాది ప్రస్తుత కమిటీలో మోపిదేవి వెంకటరమణ లేరు. ఈ కమిటీలో ఉన్న మిగిలిన ఇద్దరు సభ్యులు ఒత్తిడి తెచ్చి పార్లమెంటరీ స్థాయి సంఘంతో కలిసి గత రెండేళ్లలో విశాఖ ఉక్కును సందర్శించలేదు. కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులతో ఉత్పత్తి తగ్గడానికి గల కారణాలపై, సమస్యలపై చర్చించలేదు. గతేడాది డిసెంబరు 30, 31న బెంగళూరులో దక్షిణ భారతదేశంలో స్టీలు వినియోగంపై సమావేశం నిర్వహిస్తే ఏపీ సభ్యులు గైర్హాజరయ్యారు. ఆ సమయంలో సీఎం పర్యటన ఉందని ఓ ఎంపీ హాజరుకాకపోవడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. పార్లమెంటరీ కమిటీ సభ్యుల్లో ఉన్న ఎంపీలు సబ్ కమిటీగా విశాఖ ప్లాంట్ను సందర్శించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!