logo

అర్హులందరికీ పథకాలు

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు. డి.ఎన్‌.పాలెం, పెద్దూరు గ్రామాల్లో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

Published : 28 Mar 2023 05:07 IST

సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి

దేవీపట్నం, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు. డి.ఎన్‌.పాలెం, పెద్దూరు గ్రామాల్లో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. అర్హులై ఉండి పథకాలు అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామాల్లో గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి పథక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా గండిపోశమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీపీ కుంజం మురళి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని