పోషకాలు ఘనం.. ప్రోత్సాహకం శూన్యం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకంలో మార్పులు చేసిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు నిధులు మాత్రం పెంచడం లేదు.
రాగిజావ తయారీకి పైసా విదల్చని ప్రభుత్వం
గ్యాస్ ఖర్చులైనా ఇవ్వాలంటున్న నిర్వాహకులు
ఎటపాక, న్యూస్టుడే
నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాలలో రాగిజావ పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకంలో మార్పులు చేసిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు నిధులు మాత్రం పెంచడం లేదు. పెరుగుతున్న ధరలకు తోడు మరింత భారం మోపుతూ అదనంగా నిధులు ఇవ్వకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు సతమతం అవుతున్నారు.
సర్కారు బడుల్లో విద్యార్థులకు గోరుముద్ద పథకంలో భాగంగా అదనపు పౌష్ఠికాహారం పేరిట ఉదయం పూట ‘రాగిజావ’ పంపిణీ మొదలుపెట్టారు. రోజు విడిచి రోజు జావ, చిక్కీలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వారంలో మూడు రోజులపాటు రాగి పిండి ఉడికించి ఇచ్చే బాధ్యత పాఠశాలల్లో మద్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకే అప్పగించారు.
* తరగతుల ప్రారంభానికి ముందే ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉప్పు, పప్పుతోపాటు గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ మెనూ కింద ఇచ్చే నిధులు చాలడం లేదని భోజన నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు కొత్తగా మంగళ, గురు, శని వారాల్లో జావ ఉడికించడానికి వాడే గ్యాస్ అదనపు భారమవుతుందని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యార్థులకు ఉడికించి ఇస్తున్న గుగ్గిళ్లకు వాడే గ్యాస్కు పైసా చెల్లించని ప్రభుత్వం, మరో అదనపు పని అప్పగించడంపై ఆవేదన చెందుతున్నారు.
* జావ చేసేందుకు రోజూ కనీసం గంట ముందుగానే పాఠశాలలకు రావాలి. కనీసం గ్యాస్ భారమైనా ప్రభుత్వం భరించాలని వారు కోరుతున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు డివిజన్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 205 ఉన్నాయి. వీటిలో సుమారు 18,771 మంది విద్యార్థులు చదువుతున్నారు.
పినపల్లిలో రాగి జావ తాగుతున్న విద్యార్థులు
ఇంకా రాని గ్లాసులు
ప్రతి విద్యార్థికి గ్లాసులిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, టెండర్లు ఖరారు కానందున ప్రస్తుతానికి ఇళ్ల నుంచి తెచ్చుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ తెచ్చుకోకపోతే సర్దుబాటు చేయాలన్న సూచనతో గ్లాసులు తెచ్చుకోని వారికి పేపర్, ప్లాస్టిక్ గ్లాసులు అక్కడక్కడ వినియోగిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు తాగిన తర్వాత వాటినే కడిగి ఇస్తున్నారు. రోజూ ప్లాస్టిక్ గ్లాసులు ఇవ్వాలంటే మరింత చేతిచమురు వదులుతుందని ఏజెన్సీల నిర్వాహకులు వెనుకంజ వేస్తున్నారు.
అదనపు వనరులేవీ?
వంద మంది పిల్లలకు ముగ్గురు పనివారు ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది అవసరం. మెనూ ఇచ్చారు. సరిపడా వంట పాత్రలు, గ్లాసుల్లేవు, అదనంగా గ్యాస్ ఖర్చవుతుంది. గోరుముద్ద పథకం అమలుతో మాకు భారమవుతోంది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పనిచేస్తున్నాం. ఇప్పుడు రాగిజావ అందించాలని ఉదయం ఏడుగంటలకే వస్తున్నాం. రోజుకు ఏడు గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఒకరికి రూ. 3 వేలు ఇస్తున్నారు. మాకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
పద్మ, రమణ, మధ్యాహ్న భోజన నిర్వాహక సంఘాల ప్రతినిధులు
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
రాగిజావ పంపిణీకి సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వీటి పరిష్కానికి చర్యలు తీసుకుంటాం. మెనూ సక్రమంగా అమలు చేయాల్సిందే.
సలీం బాషా, డీఈఓ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!