గిరిజనులకు ప్రేమామృత ధార
అసలే శ్రీరామనవమి. ఆపై తమ గ్రామానికి సత్యసాయి సేవా ట్రస్టు సహకారంతో రక్షిత మంచినీరు వచ్చింది. ఇక ఆ గిరి పల్లె ఆనందానికి హద్దేముంటుంది. చిన్నాపెద్దా, ఆడా, మగా అంతా పండగ వేళ తమ గ్రామానికి
రక్షిత నీటి పథకాన్ని ప్రారంభిస్తున్న సత్యసాయి సేవాట్రస్టు ప్రతినిధులు
చింతపల్లి, న్యూస్టుడే : అసలే శ్రీరామనవమి. ఆపై తమ గ్రామానికి సత్యసాయి సేవా ట్రస్టు సహకారంతో రక్షిత మంచినీరు వచ్చింది. ఇక ఆ గిరి పల్లె ఆనందానికి హద్దేముంటుంది. చిన్నాపెద్దా, ఆడా, మగా అంతా పండగ వేళ తమ గ్రామానికి మంచినీరొచ్చిందన్న ఆనందంతో ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ప్రభుత్వాలు తాగునీటి సరఫరాకు ముందుకు రాకపోయినా సత్యసాయి సేవా ట్రస్టు తమ గ్రామంలో సుమారు 200 కుటుంబాలకు మంచినీరు అందించిందంటూ ఆ గిరిజనులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
బిందెలతో ఏర్పాటు చేసిన తోరణాలు
చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ బయలు కించంగి గ్రామానికి ఆనుకుని ఉన్న పెద్దవీధిలో సుమారు 200 గిరిజన కుటుంబాలున్నాయి. వీరికి చాలాకాలంగా తాగునీటి సదుపాయం లేదు. ప్రభుత్వ పథకాలు పనిచేయకపోవడంతో గిరిజనులంతా తాగునీటికి అవస్థలు పడుతున్నారు. దీనిపై పెద్దవీధి గిరిజనులు సత్యసాయి సేవాట్రస్టు ప్రతినిధులను సంప్రదించారు. గ్రామస్థులంతా శ్రమదానం చేస్తే సుమారు రూ.5 లక్షలు వెచ్చించి అవసరమైన రక్షిత నీటి పథకాన్ని నిర్మిస్తామని ట్రస్టు ప్రతినిధులు హామీ ఇచ్చారు. దీనికి గ్రామస్థులంతా అంగీకరించారు. సత్యసాయి ప్రేమామృత ధార పథకంలో భాగంగా కొండపై ఉన్న నీటి వనరులను ఆధారంగా చేసుకుని ట్యాంకు, పైపులైన్లు, కుళాయిల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సత్యసాయి సేవాట్రస్టు ప్రతినిధులు సమకూర్చారు. గిరిజనులంతా శ్రమదానం చేసి పథకం నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరించారు.
గిరిజనుల సంప్రదాయ స్వాగతం
సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులుగా ఉన్న హైదరాబాద్కు చెందిన వశిష్ఠ జీవిత బీమా సంస్థ ప్రతినిధులు వంశీతోపాటు సినీపాటల రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామశాస్త్రి దంపతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నీటి కుళాయిలను అతిథులు, సత్యసాయి సేవాట్రస్టు ప్రతినిధులు గణేష్, మూర్తి తదితరులు ప్రారంభించారు. చౌడుపల్లి సర్పంచి కె. లలిత, ఎంపీటీసీ సభ్యురాలు లువ్వాబు మీనా కుమారి, మాజీ సర్పంచులు సాగిన కృష్ణపడాల్, అప్పలమ్మ, దేవుడమ్మ, సత్యసాయి ట్రస్టు ప్రతినిధి అడపా విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం