విద్యాశాఖలో గందరగోళం
విద్యాశాఖలో ఇటు పదోన్నతులు.. అటు బదిలీలు ఒకేసారి చేపడుతుండటంతో ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు. హైస్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ బోధనకు స్కూల్ అసిసెంట్లను ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి నియమించుకుంటున్నారు.
పదోన్నతులు.. బదిలీలకు ఒకేసారి కసరత్తు
స్థానచలనానికి 6,088 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు
ఈనాడు డిజిటల్ - అనకాపల్లి, న్యూస్టుడే - పాడేరు
సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు
విద్యాశాఖలో ఇటు పదోన్నతులు.. అటు బదిలీలు ఒకేసారి చేపడుతుండటంతో ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారు. హైస్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ బోధనకు స్కూల్ అసిసెంట్లను ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి నియమించుకుంటున్నారు. వీరి స్థానంలో ఖాళీ అయిన పాఠశాల సహాయక పోస్టులను సెంకడరీ గ్రేడ్ టీచర్లతో భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల ఖాళీల్లోను ఎస్జీటీలనే నియమించాల్సి ఉంది. ఈ ప్రక్రియంతా పూర్తయితేనే ఏయే పాఠశాలల్లో ఎన్ని ఖాళీలున్నాయి స్పష్టంగా తెలుస్తుంది.
విలీన పాఠశాలలతో వెయ్యికి పైగా ఎస్జీటీ పోస్టులు మిగులు చూపిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో ఖాళీలను ఈ బదిలీల్లో చూపించడానికి అవకాశం లేదు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో 10 శాతం ఖాళీలను బ్లాక్ చేయబోతున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే బదిలీలకు దరఖాస్తులు స్వీకరించారు. శనివారం ఉదయం వరకు అవకాశం ఇవ్వగా 6088 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. జీరో సర్వీసు నుంచి దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం.. ఉమ్మడి జిల్లా నుంచి ఆఖరి బదిలీలు కావడంతో ఎక్కువ మంది పోటీపడుతున్నారు.
ఒకేచోట ఎనిమిది విద్యా సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, అయిదేళ్లు పూర్తయిన హెచ్ఎం, ఎంఈవోలకు స్థానచలనం తప్పదు. వీరికి తోడు గతేడాది సుమారు 300 పైగా ప్రాథమిక పాఠశాలలను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీనివల్ల విలీన పాఠశాలల్లో 864 సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులు మిగిలిపోయాయి. ఆయా పోస్టుల్లో ఉన్నవారిని గతేడాది తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు చేశారు. ఈ ఏడాది నుంచి అక్కడి పోస్టులు రద్దు కానుండటంతో ఇప్పటివరకు అక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా అక్కడి నుంచి కదలాల్సిందే. అందువల్లే ఈసారి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫౌండేషన్ స్కూల్, ఫౌండేషన్ స్కూల్ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పేర్లతో నిర్వహించనున్నారు. ఈ కొత్త విధానంలో ఖాళీలు ఎక్కడెక్కడ చూపుతారో తెలియక గురువులు అయోమయానికి గురవుతున్నారు. ఈనె 28, 29 తేదీల్లో దరఖాస్తులు పరిశీలించి ముసాయిదా జాబితా.. తుది జాబితాలను విడుదల చేసి తర్వాత ఖాళీలను ప్రదర్శించనున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.
రంపలో 250 మంది బదిలీ!
రంపచోడవరం, న్యూస్టుడే: గిరిజన సంక్షేమ శాఖ (విద్య) ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించే ఉపాధ్యాయుల బదిలీలకు అన్ని చర్యలు పూర్తిచేశామని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాన్రాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఐటీడీఏ సమావేశమందిరంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీడీ సమావేశమయ్యారు. ఆశ్రమ పాఠశాలలతో పాటు గిరిజన ప్రాధమిక పాఠశాలల్లో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన సుమారు 250మంది బదిలీ అవుతారన్నారు. డీడీ కార్యాలయ పర్యవేక్షకులు కిషోర్, సంఘాల నాయకులు వేణుగోపాల్, నాగభూషణ, విల్సన్బాబు, సూరిబాబు, రంగారావు, మంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM