గంజాయితో ఇంజినీర్ల అరెస్టు
సీలేరు జెన్కో తనిఖీ కేంద్రం వద్ద పది కేజీల గంజాయితో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిలో ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి, కారు, నిందితులతో పోలీసులు
సీలేరు, న్యూస్టుడే: సీలేరు జెన్కో తనిఖీ కేంద్రం వద్ద పది కేజీల గంజాయితో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వీరిలో ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం జెన్కో తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా.. ధారకొండ నుంచి తెలంగాణ రాష్ట్రం రిజిస్ట్రేషన్తో కారు వచ్చింది. దాన్ని తనిఖీ చేస్తుండగా.. కారు నుంచి ఓ వ్యక్తి దిగి పారిపోయాడు. అందులో 10 కేజీల గంజాయి లభించింది. కారులో ఉన్న కరీంనగర్ ప్రాంతానికి చెందిన మిగతా ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు. వీరి వద్ద నుంచి రెండు చరవాణులు, రూ.650 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురు పరారయ్యారని ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
China: సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్మెరైనర్ల మృతి..!
-
KTR: దిల్లీ బాస్ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు