ముందస్తు ఆడిట్ విధానం విజయవంతం
రాష్టంలో గత ఏడాది ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ముందస్తు ఆడిట్ విధానం విజయవంతమైందని, ఈ నెలలో పురపాలక శాఖలో కూడా బిల్లులు చెల్లించే విధానం అమల్లోకి తెస్తున్నామని స్టేట్ ఆడిట్ రాష్ట్ర డైరెక్టర్ ఆర్.హరిప్రకాష్ తెలిపారు.
మాట్లాడుతున్న హరిప్రకాష్
కొత్తూరు (అనకాపల్లి), న్యూస్టుడే: రాష్టంలో గత ఏడాది ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ముందస్తు ఆడిట్ విధానం విజయవంతమైందని, ఈ నెలలో పురపాలక శాఖలో కూడా బిల్లులు చెల్లించే విధానం అమల్లోకి తెస్తున్నామని స్టేట్ ఆడిట్ రాష్ట్ర డైరెక్టర్ ఆర్.హరిప్రకాష్ తెలిపారు. అనకాపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన అధికారులు, సిబ్బంది అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ బిల్లులు చెల్లించిన అనంతరం వీలు చూసుకొని ఆడిట్ చేసేవారమని, దీంతో ఏమైనా తప్పులు జరిగినా, అధిక చెల్లింపులు చేసినా దిద్దుబాటు చర్యలు కష్టంగా జరిగేవన్నారు. అలా కాగితాలపై నెలలు, సంవత్సరాలు కూడా వీటిపై చర్యలు జరిగేవన్నారు. దీంతో ప్రయోగాత్మకంగా దేవాదాయ శాఖలో గత ఏడాది జులై 7 నుంచి తప్పనిసరి ప్రీ ఆడిట్ విధానం ప్రవేశపెట్టామన్నారు. రూ. 2,100 కోట్ల లావాదేవీల్లో 25 శాతం వరకూ వ్యయాన్ని ఆదా చేయగలిగామని చెప్పారు. ఇది పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుందన్నారు. ఎవరూ ఎవరినీ సంప్రదించాల్సిన పనిలేదన్నారు. ప్రతి చెల్లింపునకు ముందస్తుగా ఆడిట్ చేయించుకొని, అనుమతి పొందిన తరవాతే బిల్లులు చెల్లించడం సాధ్యం అవుతుందన్నారు. దీంతో ఇప్పటికే 60 శాతానికి పైగా సత్పలితాలు వచ్చాయన్నారు. శత శాతం ఫలితాలు సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఎదురైన సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పుడు పురపాలక, ఆర్థిక శాఖల అనుమతితో పురపాలక శాఖలో ముందస్తు ఆడిట్ విధానం అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయాలు కూడా ఈ విధానం కోరాయని, పంచాయతీరాజ్ శాఖలో కూడా ప్రయత్నాలు ఆరంభమయ్యాయన్నారు. దీంతో నిధులు విడుదలకు ముందే జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు ఉంటుందన్నారు. నిధులు చేజారిన తరవాత రికవరీ విధానం ఇబ్బందిగా మారుతోందన్నారు. ఈ విధానంపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అవసరమైన సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుతున్నామన్నారు. ఎప్పటి ఆడిట్ అప్పుడే పూర్తి అవుతుందన్నారు. అనుమతి లేకుంటే బిల్లులు చెల్లించడం సాధ్యం కాదన్నారు. విశాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పి.సీతారామారావు, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి అధికారి నాగభూషణం, ఆడిట్ అధికారులు సుధాకర్రాజు, శ్రీనివాస్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!