ఆ మాత్రం ఇవ్వలేరు..!
‘జక్కంపూడికాలనీకి చెందిన ఎస్.వెంకటేశ్వరమ్మకు తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తుండడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఓపీకి సోమవారం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు 15 రోజులకు మందులను రాశారు. మందులను వాడిన తర్వాత మరోసారి రమ్మని సూచించారు.
ఐదు రోజులకోసారి ఆస్పత్రికి రాలేకపోతున్నాం..!
ఈనాడు, అమరావతి
‘జక్కంపూడికాలనీకి చెందిన ఎస్.వెంకటేశ్వరమ్మకు తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తుండడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఓపీకి సోమవారం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు 15 రోజులకు మందులను రాశారు. మందులను వాడిన తర్వాత మరోసారి రమ్మని సూచించారు. ఆమె మందుల కౌంటర్ వద్దకు వెళితే.. కేవలం ఐదు రోజులకు మాత్రమే మందులను ఇచ్చారు. అవి అయిపోయిన తర్వాత రమ్మని చెప్పారు. వైద్యులు రాసిన చీటీలోని రెండు రకాల మందులు కూడా లేవని, వాటిని బయట కొనుక్కోమని చెప్పారు. ఆమెకు వైద్యులు రాసిన రెండు వారాల మందుల కోసం మూడుసార్లు ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిన పరిస్థితి ఉందని బతిమాలినా.. కౌంటర్లోని సిబ్బంది పట్టించుకోలేదు. కేవలం ఐదు రోజులకు మాత్రమే మందులు ఇవ్వాలని తమకు చెప్పారంటూ ఆమెకు చెప్పి పంపించేశారు.’
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం ఓపీకి రెండు వేల మందికి పైగా ప్రస్తుతం వస్తున్నారు. వీరిలో కొద్దిమంది ఆసుపత్రిలో చేరుతుంటారు. మిగిలిన వారికి మందులను రాసి వాడుకోమని వైద్యులు సూచిస్తుంటారు. దీంతో రోజుకు కనీసం 1500మందికి పైగా మందుల కౌంటర్ల వద్ద బారులుతీరి మందులను తీసుకుంటూ ఉంటారు. అయితే.. వీరి వ్యాధిని బట్టి వైద్యులు రెండు వారాల నుంచి నెల రోజులకు పైగా మందులను రాస్తుంటారు. కొంతమంది దీర్ఘకాలికంగా మందులను వాడాల్సి ఉంటుంది. వైద్యులు ఎన్ని రోజులకు మందులు రాసినా.. ఆసుపత్రిలోని ఉచిత కౌంటర్లో మాత్రం కేవలం ఐదు రోజులకే ఇస్తున్నారు. దీంతో నెల రోజులకు మందులను రాస్తే.. కనీసం ఆరుసార్లు ఆసుపత్రికి వస్తున్నారు. అసలే పేద రోగులు కావడంతో.. బయట కొనుక్కునే స్థోమత లేక ఆటో, బస్సు ఛార్జీలను పెట్టుకుని ఐదు రోజులకోసారి ఆసుపత్రికి వస్తున్నారు.
మందుల కౌంటర్ వద్ద రోగులు, వారి బంధువుల రద్దీ
ఐదు రోజులకోసారి విజయవాడలోని పలు ప్రాంతాల నుంచి ఆసుపత్రికి రావడమే కష్టంగా మారుతోంది. ఇంక నగర శివారుల్లోని పల్లెలు, జిల్లాలోని ఇతర ప్రాంతల నుంచి మందుల కోసం ప్రతిసారి వచ్చి వెళ్లడం జరగని పనే. అందుకే.. కొంతమంది ఒకసారి మాత్రమే ఆసుపత్రిలో మందులను తీసుకుని, ఐదు రోజులకు అవి అయిపోయాక స్థానికంగా ఉండే మందుల దుకాణాల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. శస్త్రచికిత్సలు చేయించుకుని ఇళ్ల వద్ద ఉంటూ దీర్ఘకాలం మందులను వాడే వారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంటోంది.
చాలాకాల నుంచి ఇదే సమస్య..
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజులకు మాత్రమే మందులను ఇస్తుండడంతో రోగుల పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. రోజూ ఓపీకి వచ్చే రెండు వేల మందితోపాటు ఐదు రోజులకోసారి మళ్లీ మళ్లీ వచ్చే వారితో మందుల కౌంటర్ల వద్ద భారీగా రద్దీ పెరుగుతోంది. ప్రతి ఐదు రోజులకోసారి ఆసుపత్రికి వచ్చి క్యూలైన్లో నిలబడడం చాలా కష్టంగా ఉంటోందని వృద్ధులు, మహిళలు వాపోతున్నారు. చాలాకాలం నుంచి ఇదే సమస్య ఉందని చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నెల రోజులకోసారి ఇచ్చేవారు. తర్వాత 15 రోజులకు ఓసారి ఇచ్చేవారు.
ఇప్పుడు కేవలం ఐదు రోజులకే తగ్గించడంతో.. ఇలా వచ్చామా.. మందులు వాడామా.. మళ్లీ వచ్చి క్యూలో నిలబడ్డామా అన్నట్టుగానే తమ పరిస్థితి ఉంటోందని విజయవాడకు చెందిన ఓ వృద్ధుడు వాపోయాడు.
వైద్యులు రాసిన వాటిలో కొన్నే..
వైద్యులు రాస్తున్న మందుల్లో కొన్ని మాత్రమే ఆసుపత్రిలోని కౌంటర్లో ఉంటున్నాయి. లేనివి బయట కొనుగోలు చేసుకోమంటూ సూచిస్తున్నారు. అధికారులు మాత్రం మందుల కొరత లేదని చెబుతున్నారు. ఉన్న మందులు కూడా ఐదు రోజులకే ఇస్తున్నారు. ఇదేంటని గొడవ పడుతుండడంతో.. ఐదు రోజులకే మందులు ఇస్తామంటూ ఆసుపత్రిలోని మందుల కౌంటర్ వద్ద నోటీసులు కూడా అంటించారు. కనీసం ఓ పది రోజులకైనా మందులు ఇస్తే.. తమకు కొంత భారం తగ్గుతుందని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం