Kodali Nani: ‘వచ్చే ఎన్నికల్లో వంశీనే అభ్యర్థి’
2024లో వల్లభనేని వంశీమోహనే గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఈ విషయం సీఎం జగన్మోహన్రెడ్డే తనతో స్పష్టంగా చెప్పారని, అయితే వ్యక్తులతో తనకు సంబంధం లేదని తమ అధినేత జగన్ ఎవరిని నిలబెడితే వారి
మాట్లాడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని, పక్కన మంత్రి జోగి రమేష్, పేర్ని నాని తదితరులు
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: 2024లో వల్లభనేని వంశీమోహనే గన్నవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఈ విషయం సీఎం జగన్మోహన్రెడ్డే తనతో స్పష్టంగా చెప్పారని, అయితే వ్యక్తులతో తనకు సంబంధం లేదని తమ అధినేత జగన్ ఎవరిని నిలబెడితే వారి విజయం కోసమే పార్టీ శ్రేణులు కృషి చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం దావాజీగూడెం ఎస్వీఆర్ కల్యాణ మండపంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి అధ్యక్షతన గన్నవరం నియోజకవర్గ వైకాపా ప్లీనరీ జరిగింది. ఈ సందుర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ గన్నవరంలో తెదేపాకు సరైన నాయకుడే లేని దుస్థితి నెలకొందన్న అన్నారు. పెనమలూరు టిక్కెట్ అడిగేందుకు వెళ్లిన ఆ పార్టీ నాయకులను గన్నవరం, గుడివాడలో పోటీ చేయాలని సూచిస్తున్నారని తెలిపారు. సర్గీయ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఏదో అన్నారని వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు.. తన తండ్రి ఖర్జూరపునాయుడు అంటూ ఎప్పుడన్నా చెప్పారా? అంటూ విమర్శలు చేశారు. మరో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ తెదేపా పాలనతో గుర్తిండిపోయే ఒక్క మంచి పథకాన్ని కూడా అప్పటి సీఎం చంద్రబాబు పెట్టలేకపోయారని విమర్శించారు. ఒక్క అమరావతికే రూ.లక్ష కోట్లు పెడితే నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలకు నగదు ఎవరిస్తారంటూ ప్రశ్నించారు. 2వ తేదీ జరిగే జిల్లా ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ నేతలు గౌతమ్రెడ్డి కోరారు. ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ వంశీ అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు.. ఈనెల 30వ తేదీలోగా నియోజకవర్గాల ప్లీనరీలు పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించడం వల్లనే ఎమ్మెల్యే లేకుండా తాము ప్లీనరీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య, ఎంపీపీలు రవి, చెన్ను ప్రసన్నకుమారీ, సరోజిని, పడమట సురేష్, పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, శ్రేణులు పాల్గొన్నారు.
వైఎస్సార్ను అవమానించేలా కొడాలి ప్రవర్తన
ప్లీనరీకి అతిథిగా హాజరైన మాజీ మంత్రి కొడాలి నానిని ప్రారంభోత్సవంలో భాగంగా దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేయాలంటూ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్నినానితో కలిసి నాయకులు కోరారు. ఆ సమయంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేయకుండా పక్కనే ఉన్న స్థానిక జడ్పీ కో-ఆప్టెడ్ సభ్యుడు ఎండీ గౌసాని మెడలో కొడాలి నాని పూలమాల వేయడం చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434