కార్డులు ఎక్కడ...రాయితీ ఎలా..?
ఈ ఏడాది ఖరీఫ్ను ముందస్తుగా ప్రారంభించాలని చెప్పిన పాలకులు దానికి అనుబంధంగా ఉండే ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించడం లేదని రైతులు వాపోతున్నారు. వాటిలో ప్రధానమైనవి కౌలురైతు గుర్తింపు కార్డులు. ఈ ఖరీఫ్లో జిల్లాలో ఉన్న కౌలు విస్తీర్ణాన్ని బట్టి 50వేలకుపైగా కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
ప్రారంభమైన సాగు పనులు
ఆందోళనలో అన్నదాతలు
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్టుడే
ఈ ఏడాది ఖరీఫ్ను ముందస్తుగా ప్రారంభించాలని చెప్పిన పాలకులు దానికి అనుబంధంగా ఉండే ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించడం లేదని రైతులు వాపోతున్నారు. వాటిలో ప్రధానమైనవి కౌలురైతు గుర్తింపు కార్డులు. ఈ ఖరీఫ్లో జిల్లాలో ఉన్న కౌలు విస్తీర్ణాన్ని బట్టి 50వేలకుపైగా కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు పనులు ప్రారంభమైనా ఇంకా పంపిణీ పూర్తికాలేదు. గతేడాది జూన్ నెలాఖరు వరకు ఇచ్చిన కార్డులను మాత్రమే రైతుభరోసాకు పరిగణనలోకి తీసుకోవడంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఈసారి కూడా అలాంటి సమస్య పునరావృతం అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చాలామండలాల్లో ఇంకా సగం కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది.
ఇచ్చింది 49శాతమే
జిల్లావ్యాప్తంగా సీసీఆర్సీ కార్డుల పంపిణీ ప్రక్రియ 49శాతం మాత్రమే పూర్తయ్యింది. నాగాయలంక మండలంలో అత్యధికంగా 87శాతం పూర్తి చేయగా గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో అతి తక్కువగా 29శాతం పూర్తి చేశారు. బందరు, కంకిపాడు మండలాల్లో 70శాతానికి పైగా చల్లపల్లి, మోపిదేవి, కృత్తివెన్ను, పెనమలూరు, ఉయ్యూరు, గూడూరు, ఉంగుటూరు, బంటుమిల్లి, కోడూరు మండలాల్లో 66 నుంచి 50శాతం మధ్యలో పూర్తిచేసి కొంతవరకు ఫర్వాలేదనిపించారు. తోట్లవల్లూరు, పెదపారుపూడి, గన్నవరం, పెడన, అవనిగడ్డ, మొవ్వ, పమిడిముక్కల, పామర్రు, బాపులపాడు, ఘంటసాల, గుడివాడ, మండలాల్లో 50శాతం లోపే అందజేశారు. సీసీఆర్సీ కార్డుల పంపిణీలో మిగిలిన జిల్లాలతో పోల్చితే కొంతవరకు ఫర్వాలేదు. కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యమైతే ప్రభుత్వం అందించే లబ్ధి కోల్పోయే అవకాశం ఉందని కౌలురైతులు ఆవేదన చెందుతున్నారు.
అది ఉంటేనే రైతు భరోసా
కౌలు రైతుల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు సీసీకార్డు ఉంటే రైతుభరోసా అందిస్తారు.దీంతోపాటు ప్రభుత్వం ఇచ్చే ఏ రాయితీ పొందాలన్నా పంటసాగు హక్కు పత్రం తప్పని సరి. ఇప్పటికే రైతుభరోసా కేంద్రాల ద్వారా రాయితీపై వరి విత్తనాలు పంపిణీ ప్రక్రియ పారరంభించారు. పెడన, గూడూరు, బందరు వివిధ మండలాల్లో రైతులు వెద పద్ధతిలో సాగు పనులు ప్రారంభించారు. ఇప్పటికీ ప్రక్రియ పూర్తిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. కౌలు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా భూ యజమానులు అంగీకరించకపోవడంతో చాలామంది కార్డులు పొందలేక పోతున్నారు. మిగిలిన వారికైనా సక్రమంగా అందుతాయా అంటే అదీ కనిపించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటపై పెట్టుబడికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలన్నా కార్డు అవసరం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
త్వరలోనే పూర్తి చేస్తాం
సీసీఆర్సీ కార్డుల పంపిణీ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుంది. ప్రస్తుతం కార్డుల జారీలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కృష్ణా జిల్లా ముందంజలో ఉంది. రెవెన్యూశాఖ ఉద్యోగులను సమన్వయం చేసుకుని త్వరితగతిన పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాం. వెనుకబడిన మండలాల అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. కౌలు రైతులు కూడా చొరవ తీసుకుని వ్యవసాయశాఖ సిబ్బందిని కలిసి కార్డులు పొందాలి. భూ యజమానులు కూడా అవగాహనతో కౌలురైతుకు పంటసాగుహక్కు పత్రాలు అందించేందుకు అంగీకారం తెలపాలని కోరుతున్నాం.
- మనోహరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు