logo

రూ.2.66 లక్షల వెండి ఆభరణాల సమర్పణ

కృష్ణాపురంలోని  గంగాపార్వతీసమేత ఆనంద రామేశ్వరస్వామికి ఆదివారం దాతలు రూ.2.66 లక్షల విలువైన వెండి ఆభరణాలు సమర్పించారు. అమ్మవారికి 1.25

Published : 03 Oct 2022 05:46 IST

కృష్ణాపురం (పమిడిముక్కల), న్యూస్‌టుడే: కృష్ణాపురంలోని  గంగాపార్వతీసమేత ఆనంద రామేశ్వరస్వామికి ఆదివారం దాతలు రూ.2.66 లక్షల విలువైన వెండి ఆభరణాలు సమర్పించారు. అమ్మవారికి 1.25 లక్షలతో చేయించిన నల్లపూసల గొలుసును చలసాని ఝాన్సీలక్ష్మి (అమెరికా), రూ.1.06 లక్షల విలువైన వెండి కవచం, మకరతోరణమును కృష్ణాపురం వాస్తవ్యులు యలమంచిలి జయరామకృష్ణప్రసాద్‌, డాక్టర్‌ మన్నే నాగభాస్కరరావు, రూ.35 వేలతో విఘ్నేశ్వరునికి వెండి కిరీటాన్ని పిన్నమనేని ఝాన్సీలక్ష్మి సమర్పించారు. దాతలు ప్రత్యేక పూజల అనంతరం అన్నసంతర్పణ చేశారు. స్థానికులు మోటూరు వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని