భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతు నొక్కుతున్నారు : కాంగ్రెస్
దేశంలో స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతు నొక్కుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు.
రాజ్యాంగంలో కీలకమైన అంశాల ప్రతిని చూపుతున్న
శైలజానాథ్. చిత్రంలో గురునాథరావు, నరసింహారావు
గవర్నర్పేట, న్యూస్టుడే : దేశంలో స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతు నొక్కుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం ఆంధ్రరత్న భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో స్వేచ్ఛకు భంగం కలుగుతోందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గట్టిగా చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశం కోసం నిజాయతీగా పనిచేసిన వారంతా కలిసి కూర్చుని, రాజకీయ అభిప్రాయాలను పక్కన పెట్టి దేశం కోసం, ప్రజల మంచి కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం రచించారని తెలిపారు. రాజ్యాంగంలోని న్యాయం, స్వాతంత్య్రం, స్వేచ్ఛ, సమానత్వానికి.. భాజపా రూపంలో సవాలు వచ్చిందన్నారు. మనిషి మనిషికి మధ్య దూరం పెరుగుతోందని, అల్ప సంఖ్యాకులైన కొందరు.. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని ప్రపంచ కుబేరుగా చెలామణి అవుతుంటే.. కోటానుకోట్ల మంది నిరుపేదలవుతున్నారని పేర్కొన్నారు. న్యాయం ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా ఉంటోందన్నారు. కేంద్రం, రాష్ట్రం నుంచి స్వేచ్ఛను వెతుక్కునే కాలం వచ్చిందని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛ, ఆస్తి కలిగి ఉండే స్వేచ్ఛ వంటి వాటికి భంగం కలుగుతోందని దుయ్యపట్టారు. గౌరవô కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, దాని కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్గాంధీ ఆ ప్రయత్నంలోనే ఉన్నారని గుర్తు చేశారు. రాజకీయాలు, పార్టీలకతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. అధికారంలో ఉన్న వారు భారత రాజ్యాంగ పీఠిక చదువుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ వల్లే స్వేచ్ఛగా మాట్లాడుతున్నామని శైలజానాథ్ పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో జరిగిన సదస్సులో.. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి.గురునాథం, నరహరశెట్టి నరసింహారావు, జెట్టి గురునాథరావు, పి.వై.కిరణ్, కొరివి వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్