ఉన్నోళ్లతోనే.. లాగించేద్దాం!
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 47 ప్రభుత్వ హైస్కూళ్లలో ఆరంభించిన ఇంటర్ విద్య మొదటి ఏడాది పూర్తిగా విఫలమైంది. నిరుడు చేరిన విద్యార్థుల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
ఈసారీ హైస్కూళ్ల గురువులతోనే ఇంటర్ బోధన
గతేడాది దారుణ ఫలితాలొచ్చినా మారని వైఖరి
ఈనాడు, అమరావతి
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 47 ప్రభుత్వ హైస్కూళ్లలో ఆరంభించిన ఇంటర్ విద్య మొదటి ఏడాది పూర్తిగా విఫలమైంది. నిరుడు చేరిన విద్యార్థుల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. తరగతులు ఆలస్యంగా ఆరంభించడం, సౌకర్యాల లేమి, బోధన సిబ్బంది కొరతతో ఆశించిన ఫలితాలు రాలేదని సాకులు చెప్పారు. కనీసం ఈసారైనా.. పూర్తిస్థాయిలో ఇంటర్ విద్యకు సౌకర్యాలు, సిబ్బంది నియామకంపై దృష్టి పెడితే బాగుండేది. కానీ.. ఈసారి కూడా హైస్కూళ్ల ఉపాధ్యాయుల్లో కొందరిని ఎంపిక చేసి.. వారితో ఈ ఏడాది నెట్టుకొచ్చేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.’
గతేడాది హైస్కూళ్లలో ప్రవేశపెట్టిన ఇంటర్ విద్యలో రెండు జిల్లాల్లో కలిపి 341 మంది విద్యార్థులు చేరారు. వీరిలో కేవలం 42 మంది మాత్రమే సొంతంగా చదివి ఉత్తీర్ణులయ్యారు. హైస్కూళ్లలో పదో తరగతి వరకూ బోధించే స్కూల్ అసిస్టెంట్లనే బతిమాలి కొందరితో తరగతులు చెప్పించారు. ఈ మాత్రం దానికి.. అసలు హైస్కూళ్లలో ఇంటర్ విద్య ఎందుకు ప్రవేశపెట్టారని... తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వీటికంటే ఇప్పటికే ఉన్న ఇంటర్ ప్రభుత్వ కళాశాలలు వంద రెట్లు మెరుగ్గా ఉన్నాయి. ఇంటర్ విద్యకు అవసరమైన సౌకర్యాలు.. అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారు. అయినా.. ఇంటికి దగ్గరిలో కళాశాల విద్య కూడా వచ్చిందనే ఆనందంతో విద్యార్థులొచ్చి చేరారు. కానీ.. కనీసం తరగతులను సైతం సరిగా చెప్పకపోవడంతో అత్యధికశాతం మంది విద్యార్థులు పరీక్షలు తప్పారు.
ఉన్నోళ్లలోనే కొందరిని తీసుకొచ్చి...
ఈ ఏడాది రెండు జిల్లాల్లో ప్రభుత్వ, నగరపాలక, జడ్పీ పాఠశాలల్లోని 276 మంది వరకు ఉపాధ్యాయులు ముందుకొస్తే ఇంటర్ బోధనకు సరిపోతుందని అధికారుల అంచనా. ప్రస్తుతం బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మేథ్స్, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, తెలుగు, ఇంగ్లీష్ బోధించే వాళ్లు కావాలి. కానీ.. ఇప్పటివరకూ పదో తరగతి వరకే బోధించే ఉపాధ్యాయులు.. ఇంటర్ పాఠ్యాంశాలను పూర్తిస్థాయిలో చెప్పగలరా అనేది సందేహమే. వీరికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. గతసారి కూడా చాలాచోట్ల వీళ్లే బోధించడంతో ఫలితాలు దారుణంగా వచ్చాయి.
ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ చేసిన సింగ్నగర్లోని ఎం.కె.బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల
ఇప్పటికి మూడుసార్లు పిలిచారు..
ఈ ఏడాది బోధనా సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. బయట నుంచి ఇంటర్ విద్యకు అవసరమైన జూనియర్ లెక్చరర్లను నియమిస్తారని అంతా భావించారు. కానీ.. ఈసారి కూడా హైస్కూళ్లలో ఉపాధ్యాయుల్లోనే కొందరిని ఎంపిక చేసి నియమించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ.. పీజీలో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లు ఎవరైనా ఆయా సబ్జెక్టుల్లో బీఈడీ కలిగి ఉండి ఆసక్తి ఉంటే ఇంటర్ బోధనకు రావాలని విద్యాశాఖ కోరింది. ఇప్పటికి మూడుసార్లు పిలిస్తే.. 242 మంది వచ్చారు. వీరిని ఆయా ఖాళీల్లో సర్దుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. దీంతో కనీసం ఒక్కో హైస్కూల్ ప్లస్ పాఠశాలకు కనీసం ఇద్దరు ముగ్గురినైనా నియమించాలని అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. విజయవాడ పరిధిలో రెండు నగరపాలక, ఒక ప్రభుత్వ కలిపి మూడు హైస్కూల్ ప్లస్ పాఠశాలలున్నాయి. వీటిలో ఇంటర్ విద్య బోధించేందుకు ఇప్పటివరకూ ఒక్కరిని కూడా నియమించలేదని తెలుస్తోంది.
ఒక్క విద్యార్థి కూడా గట్టెక్కలేదు...
కృష్ణా జిల్లాలో 18, ఎన్టీఆర్లో 16 హైస్కూళ్లలో మాత్రమే ఇంటర్ విద్యలో 341 మంది చేరారు. వీరిలో కృష్ణాలో 221, ఎన్టీఆర్లో 120 మంది ఉన్నారు. కృష్ణాలోని ఘంటసాల, కోడూరు, బాపులపాడు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, అవనిగడ్డ, పెనమలూరు మండలాల్లోని పాఠశాలల్లో ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేదు. పెడన, గూడూరు, బంటుమిల్లి, గుడ్లవల్లేరు, పునాదిపాడుల్లో ఒక్కొక్కరు ఉత్తీర్ణులయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోనూ కంచికచర్ల వంటిచోట్ల ఒక్కరు కూడా పాస్ కాలేదు.
ఈసారి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి..
గతసారి మొదటి ఏడాది చేరిన వాళ్లు ప్రస్తుతం రెండో ఏడాదికి వచ్చారు. వీరికి ఈ ఏడాది ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఇవి చాలా కీలకం. కానీ.. ప్రస్తుతం ఎక్కడా ప్రత్యేకంగా వీరికి అవసరమైన ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్న దాఖలాలు లేవు. దీంతో విద్యార్థుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు