నిశిత తనిఖీలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
ఒకే రోజు రూ.3.07 లక్షల నగదు పట్టివేత
విజయవాడ నేరవార్తలు, విద్యాధరపురం, న్యూస్టుడే
ప్రకాశం బ్యారేజీ వద్ద సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీసీపీ టి.హరికృష్ణ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్క గురువారం రోజున ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలోని రెండు చెక్పోస్టుల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.3.07 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటుపల్లిలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.2లక్షలు, ప్రకాశం బ్యారేజీ వద్ద మరో వ్యక్తి నుంచి రూ.1.07 లక్షలు పట్టుబడ్డాయి. పశ్చిమ జోన్ డీసీపీ టి.హరికృష్ణ నేతృత్వంలో గురువారం రాత్రి నగరంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ వద్ద.. చెక్పోస్టు సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీసు అధికారులు, స్టాటిక్ సర్వేలెన్స్ టీంతో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
సీసీ కెమెరాలతో రికార్డింగ్..
చెక్పోస్టుల వద్ద తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. తనిఖీల కార్యక్రమాన్ని మొత్తాన్ని సీసీ కెమెరాలతో రికార్డు చేస్తున్నారు. దాన్ని ఎన్నికల కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. ఫలితంగా ఏ విధమైన అవకతవకలకు అవకాశం ఉండదని, సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందన్నారు.
రెండు కొత్త చెక్పోస్ట్ల ఏర్పాటు
నగర పరిధిలో నిరంతర పరిశీలన అనంతరం ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో మరో కొత్త చెక్పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించారు. నున్న పవర్ గ్రిడ్ వద్ద, కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పాములకాలువ వద్ద చెక్పోస్టులు అత్యవసరమని గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల్లో.. కేంద్రబలగాలతో నిఘా ఉంచారు.
నగదు రవాణాలో జాగ్రత్తలు తప్పనిసరి
ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ రూ.50వేల వరకు మాత్రమే నగదు తీసుకువెళ్లవచ్చు. చాలా మంది ఆ విషయం తెలియక ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకువెళుతూ పట్టుబడుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ.50వేల కన్నా ఎక్కువ నగదు ఉంటే దాన్ని స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని డీసీపీ హరికృష్ణ తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
బంగారం.. నగదు స్వాధీనం
గుంటుపల్లిలో స్వాధీనం చేసుకున్న నగదుతో పోలీసులు
కృష్ణలంక, న్యూస్టుడే: గుంటూరు వైపు నుంచి వచ్చే కనకదుర్గమ్మ వారధి చెక్పోస్ట్ వద్ద గురువారం చేపట్టిన సోదాల్లో పోలీసులు బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. కారును ఆపి సోదాలు నిర్వహించగా.. అందులో సుమారు 500 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.70 వేల నగదు ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన రూడా అఖిల్.. నరసరావుపేట నుంచి హైదరాబాద్కు ఆభరణాలు తీసుకెళుతున్నట్లు చెప్పారు. సరైన ఆధారాలు లేనందున ఆభరణాలు, నగదు మొత్తం స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్