1నే జీతాలివ్వండి మహాప్రభో!
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.
వైకాపా పాలనపై ఉపాధ్యాయులు, ఉద్యోగుల అసహనం
న్యూస్టుడే, మచిలీపట్నం కార్పొరేషన్: తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సి ఉండగా 15వతేదీకి కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛను దారులు ఉంటే జిల్లాలో లక్షమందికి పైగా ఉన్నారు. ఉద్యోగుల జీతాలతోపాటు విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు కూడా సకాలంలో అందక అవస్థలు పడుతున్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎన్ని నెలలకు జీతాలు ఇస్తారో కూడా తెలియని దుస్థితి దాపురించింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హామీల వర్షం కురిపించిన జగన్ సీఎం అయిన తరువాత వాటి గురించి పట్టించుకోలేదని అదేంటని ప్రశ్నించిన వారిని అరెస్టులు చేయించడం, భయపెడుతూ అణచివేతకు గురిచేశారని ఉద్యోగ వర్గాలు విమర్శిస్తున్నాయి.
ఉద్యోగుల సమస్యలపై చేపట్టిన ధర్నాలో పాల్గొన్న సంఘ నాయకులు, ఉద్యోగులు
వడ్డీ కట్టాల్సి వస్తోంది
ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వండి అంటూ మొరపెట్టుకున్న దాఖలాలు గతంలో చూడలేదు. ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాలు 7వ తేదీ, 10వతేదీ ఇలా వారం పదిరోజులు ఆలస్యంగా అయినా ఇస్తున్నాం కదా అని పాలకులు మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. ఆ జీతంపై ఆధారపడే ప్రతి నెల ఒకటో తేదీన ఈఎంఐలు కట్టకపోతే వడ్డీలు వేస్తున్నారు. అవి కట్టడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు సక్రమంగా ఇవ్వడంతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఇవ్వాల్సిన రూ. వేల కోట్ల బకాయిలు తక్షణం విడుదల చేయాలని కోరుతున్నాం.
కేఏ. ఉమామహేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
రోడ్డెకాల్సి వచ్చింది
ఉద్యోగుల జీతాలే కాదు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు కూడా సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వృద్ధాప్యంలో వచ్చే పింఛనుతోనే వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చుకుంటూ జీవనం సాగించే వృద్ధులు సైతం తమ డిమాండ్ల సాధనలో భాగంగా ధర్నాలు చేయాల్సి వచ్చింది. ఇంకా అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియని పరిస్థితి.
గుడివాడ రామస్వామి, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకుడు
ఎప్పుడూ ఇలా జరగలేదు
ప్రస్తుత ప్రభుత్వం హయాంలో గత కొన్నేళ్లుగా చూస్తే ఏ నెలా ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు తీసుకున్న దాఖలాలు లేవు. పింఛనుదారుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. బాండ్లు తాకట్టుపెట్టి అప్పుతెచ్చి జీతాలు ఇస్తున్నారు. ఉద్యోగ విరమణ తరువాత వచ్చే ప్రోత్సాహకాల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి దుస్థితి దాపురించింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బకాయిలు విడుదల చేయాలి.
పైడిపాటి రామ్దేవ్, యూటీఎఫ్ పూర్వ జిల్లా అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
[ 01-05-2024]
‘నా మానసిక పరిస్థితి బాగోలేదు. చాలా ఒత్తిడిలో ఉన్నా. అమ్మ, భార్య, పిల్లలంటే నాకు ప్రాణం. నేను చనిపోయాక వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా చేశానని’’ డాక్టర్ శ్రీనివాస్ తన ఫోన్లో వాయిస్ రికార్డు చేశారు. -
శ్రమజీవికీ ద్రోహ ‘మే’..!
[ 01-05-2024]
తెల్లవారుజామునే నిద్ర లేచి.. ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని... చద్దిబువ్వ మూటకట్టుకుని.. పొట్టకూటి కోసం అడ్డాలకు చేరుకుంటారు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు. ఎవరైనా కాస్త పని ఇప్పించకపోతారా? అని వేయికళ్లతో ఎదురుచూస్తూనే ఉంటారు -
బాబోయ్ అన్నా... బే‘ఖాతా’ర్..!
[ 01-05-2024]
మే.. సామాజిక పింఛన్లను బ్యాంకుల్లో వేయడమంటే.. వృద్ధులు, దివ్యాంగులను ఎండల్లో ముప్పుతిప్పలు పెట్టడమే. కావాలనే... ఎన్నికలకు ముందు వారిని వేధించి.. ప్రాణాలమీదకొచ్చేలా చేయడమే. -
ఉప కారాగారం వార్డర్ ఆత్మహత్య
[ 01-05-2024]
స్థానిక ఉప కారాగారంలో వార్డర్గా పని చేస్తున్న దాసరి నాగ శివకుమార్ (37) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన స్థానిక ఐదో వార్డులో ఒక భవనం పై అంతస్తులో ఉన్న సింగిల్ పోర్షన్లో అద్దెకు ఉంటున్నారు. -
‘వైకాపా అరాచకాలకు ఓటుతో స్వస్తి పలకాలి’
[ 01-05-2024]
రాష్ట్రంలోనూ, గన్నవరంలోనూ వైకాపా అరాచకాలకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కునే ఆయుధంగా మలుచుకోవాలని బాపులపాడు మండలం రంగన్నగూడెం మాజీ సర్పంచి, వైకాపా నాయకురాలు ఆళ్ల నాగమణి పేర్కొన్నారు. -
జ్యోతిర్లింగ యాత్రకు ప్రత్యేక రైలు
[ 01-05-2024]
యాత్రికుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ సంస్థ జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నడపనుంది. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం : సజ్జల
[ 01-05-2024]
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెదేపా, జనసేన పార్టీ దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
జ్యోతిసురేఖకు ఘన స్వాగతం
[ 01-05-2024]
ప్రపంచ అర్చరీ పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన వన్నెం జ్యోతిసురేఖ మంగళవారం ఉదయం దిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. -
కూటమితోనే రాజ్యాంగ పరిరక్షణ: బాలశౌరి
[ 01-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాస్తూ తన సొంత రాజ్యాంగం అమలు చేశారని, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. -
పేదలకు పాట్లు.. వైకాపా నాయకులకు రూ.కోట్లు
[ 01-05-2024]
గుడివాడలో ఐదేళ్ల జగన్ ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కానీ.. ఎమ్మెల్యే నాని అండతో అతని అనుచరులు మాత్రం భారీగానే ఆర్జించారు. -
గుడివాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్
[ 01-05-2024]
ఐపీఎల్లో జరిగే బెట్టింగ్ తీరుతెన్నులు ఇది. ఓవర్లో రెండు సిక్స్లు కొడితే పందెం కాసిన బెట్టింగ్రాయుళ్లకు డబ్బులు చెల్లించాలి. అదే కొట్టలేకపోతే బెట్టింగ్ రాయుళ్లు కట్టిన సొమ్ము బుకీలకు పంపాలి. -
ఎన్నికల నిర్వహణకు సహకరించండి: కలెక్టర్
[ 01-05-2024]
జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం