వైకాపా వ్యతిరేక ఓటును ఆపే కుట్ర?
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ వినియోగం తొలి రోజైన శనివారం ప్రహసనంగా మారింది.
ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టిన వైనం
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో అవాంతరాలు
ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తికమక, గందరగోళం
ఎన్టీఆర్ కలెక్టరేట్: ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ వినియోగం తొలి రోజైన శనివారం ప్రహసనంగా మారింది. విజయవాడలో పలు ఫెసిలిటేషన్ కేంద్రాలకు వెళ్లిన ఉద్యోగులు కొందరు.. తమ ఓటు హక్కును వినియోగించుకోలేక, వెనుదిరగాల్సి వచ్చింది. ఆయా నియోజకవర్గాల పోస్టల్ బ్యాలట్లు రాలేదని చెప్పడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పీవోలు, ఏపీవోలకు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు నిర్వహించడం, తర్వాత ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం వల్ల ఇక్కట్లకు గురయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటు హక్కు వినియోగించే అవకాశం లేకపోయిందని ఉద్యోగులు వాపోయారు ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగులకు అక్కడే పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేసినా, ఎవరూ పట్టించుకోలేదని, ఎన్నికల విధులు నిర్వర్తించే చోటే.. పోస్టల్ బ్యాలట్ను వినియోగించే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఏ ఉద్యోగి ఎక్కడ పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోవాలనే విషయంలో జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. తొలి రోజు 20 శాతం మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోలేక వెనుదిరిగారని చెబుతున్నారు. ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉన్నారని, వ్యతిరేక ఓటును నిలుపుదల చేయడానికి ఇలాంటి గందరగోళ పరిస్థితులకు తెరలేపినట్లు పలువురు ఉద్యోగులు అంటున్నారు.
ఇదేం చోద్యం..
- విజయవాడ సెంట్రల్లో ఓటు హక్కు ఉన్న ఒక ఉద్యోగి.. పామర్రులో పని చేస్తున్నారు. ఈయనకు గన్నవరం లో ఎన్నికల విధులు వేశారు. తీరా ఫెసిలిటేషన్ కేంద్రం ఎక్కడో తెలపలేదు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో కేంద్రీకృత ఫెసిలిటేషన్ కేంద్రానికి రావాలా? సెంట్రల్ ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లాలా అనేది తెలియదు. తీరా నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో సెంట్రల్ నియోజకవర్గ ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళితే.. పామర్రు నుంచి పోస్టల్ బ్యాలట్ రాలేదని తెలిపారు. వివరాలు తెలుసుకోవడానికి పామర్రు లేదా బందరు వెళ్లాలని సూచించారు. దీంతో ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు.
- మరో ఇద్దరు మహిళా ఉద్యోగులు తమ ఓటు కోసం విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాలకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడకు వెళితే ఇక్కడకు, ఇక్కడకు వెళితే అక్కడకు వెళ్లాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని వాపోయారు.
- ముఖ్యంగా పీబీ సిద్ధార్థ కళాశాలలోని విజయవాడ సెంట్రల్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉద్యోగుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. పలువురు మహిళా ఉద్యోగులు గట్టిగా ప్రతిఘటిస్తే గాని, ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.
- నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులకు విజయవాడలో ఎన్నికల విధులు కేటాయించారు. తీరా వీరు శిక్షణ కోసం వచ్చిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తే.. ఆయా నియోజకవర్గాల నుంచి పోస్టల్ బ్యాలట్లు రాలేదని సమాధానం వచ్చింది. సరైన ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని చాలా మంది ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
- కొంత మంది ఉద్యోగులకు తాజాగా విధులు కేటాయించారు. పోస్టల్ బ్యాలట్ ఓటు ప్రారంభమయ్యే తేదీకి ఒక రోజు ముందు విధులు కేటాయించారు. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగానికి ఫారం-12 దాఖలు తప్పనిసరి. ఈ విషయమై ప్రశ్నిస్తే.. ఆర్వోల వద్దకు వెళ్లండని సలహా ఇచ్చారని, అక్కడకు వెళ్లినా ప్రయోజనం శూన్యం అంటూ పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
- ఫారం-12 దాఖలుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగంలో తొలి రోజు గందరగోళం నేపథ్యంలో గడువు పొడిగించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
[ 18-05-2024]
‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది. -
పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?
[ 18-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నదీ గర్భాన్ని.. గత ఐదేళ్లలో వైకాపా నేతలు తోడేళ్లలా తోడేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇసుకాసురులకు అడ్డుకట్ట పడలేదు. -
ముంచెత్తిన వర్షం
[ 18-05-2024]
జిల్లాను వర్షం ముంచెత్తింది. శుక్రవారం ఉదయం 4గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రహదార్లు జలమయమయ్యాయి. -
మరమ్మతులు మమ.. అభివృద్ధి భ్రమ
[ 18-05-2024]
కూచిపూడి నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మస్థలమైన భట్లపెనుమర్రు వరకు రహదారికి తూ..తూ.. మంత్రంగా మరమ్మతులు చేశారు. -
అరటి రైతు విలవిల
[ 18-05-2024]
అరటి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న గాలి, వానకు చెట్లు భారీగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. -
ఎన్నికల్లో జోగి అక్రమాలకు అడ్డేది?
[ 18-05-2024]
‘ఎన్నికల ఫలిలతాల తర్వాత జోగి రమేష్ పెనమలూరులో కనిపించర’ ని పెనమలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ విమర్శించారు. -
వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం తగదు
[ 18-05-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లింపుల్లో వ్యత్యాసాలు నెలకొన్నాయని, వాటిని సవరించి చెల్లించడంతో పాటు, ఎన్నికల విధులు, శిక్షణ కాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, సుందరయ్య, కోశాధికారి పి.నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్ డిల్లీరావును కోరారు -
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారం
[ 18-05-2024]
ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
ట్రాఫిక్ పనులకు రెడ్ సిగ్నల్!
[ 18-05-2024]
విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని భావించిన ఐటీఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్) ప్రాజెక్టు ఎంతకూ పూర్తి కావడం లేదు. -
తెదేపాకు ఓటేశామని...ఉపాధి పనులు నిలిపివేశారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటేశారని వైకాపా నాయకులు ఇద్దరు కూలీలకు ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. -
జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు సన్నాహాలు
[ 18-05-2024]
ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు సంకేతాలు అందడంతో, జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
ఎప్సెట్ ఫలితాలు నేడే
-
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!