logo

కత్తులతో భయపెట్టి బంగారు గొలుసు అపహరణ

పట్టపగలే దొంగలు హల్‌చల్‌ చేశారు. ఇంట్లోకి దూరి, కత్తులతో భయపెట్టి వృద్ధురాలి మెడలోని బంగారుగొలుసు లాక్కెళ్లారు. బాధితుల వివరాల మేరకు.. ఉరవకొండ సీవీవీనగర్‌లో పోతుల మల్లికార్జున అనే వ్యక్తి ఇంట్లోకి బుధవారం ఉదయం 10.15 సమయంలో దొంగలు దూరారు. అప్పుడు

Published : 20 Jan 2022 05:24 IST

అశ్వర్థమ్మ

ఉరవకొండ, న్యూస్‌టుడే: పట్టపగలే దొంగలు హల్‌చల్‌ చేశారు. ఇంట్లోకి దూరి, కత్తులతో భయపెట్టి వృద్ధురాలి మెడలోని బంగారుగొలుసు లాక్కెళ్లారు. బాధితుల వివరాల మేరకు.. ఉరవకొండ సీవీవీనగర్‌లో పోతుల మల్లికార్జున అనే వ్యక్తి ఇంట్లోకి బుధవారం ఉదయం 10.15 సమయంలో దొంగలు దూరారు. అప్పుడు వృద్ధురాలు అశ్వర్థమ్మ మాత్రమే లోపల ఉన్నారు. ఇద్దరు దొంగలు ఆమెకు కత్తి చూపించి మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసు లాక్కెళ్లారు. చేతికి ఉన్న బంగారు గాజులను తీయడానికి ప్రయత్నించగా బయటికి రాకపోవడంతో ఉడాయించారు. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్‌, ఎస్‌ఐ రమేష్‌రెడ్డి అక్కడికి చేరుకుని బాధితురాలిని విచారించారు. వారంరోజుల వ్యవధిలో మూడోసారి చోరీ చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని