icon icon icon
icon icon icon

Anantapuram: తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు.

Published : 26 Apr 2024 14:39 IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తెదేపా నాయకులు అభ్యంతరం తెలిపారు. తాము కూడా వెళ్తామంటూ పోలీసులను నిలదీశారు. ఈ నేపథ్యంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు ఆర్వో కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img