logo

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

చీకటిమానిపల్లికి చెందిన భాస్కర్‌(45) అనేవ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు.. భాస్కర్‌ తన స్నేహితులతో కలిసి గురువారం సాయంత్రం గ్రామ సమీపంలో ములకలచెరువు వైపు కొత్తగా నిర్మిస్తున్న ధాబా వద్ద మద్యం తాగారు.

Published : 21 Jan 2022 06:24 IST

చీకటిమానిపల్లి(తనకల్లు): చీకటిమానిపల్లికి చెందిన భాస్కర్‌(45) అనేవ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు.. భాస్కర్‌ తన స్నేహితులతో కలిసి గురువారం సాయంత్రం గ్రామ సమీపంలో ములకలచెరువు వైపు కొత్తగా నిర్మిస్తున్న ధాబా వద్ద మద్యం తాగారు. అక్కడ స్నేహితుల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ సమయంలో భాస్కర్‌ తలకు గాయంతో ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా ములకలచెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు వెనుకభాగాన గాయమైనట్లు గుర్తించిన వైద్యులు రెండుకుట్లు వేసి కదిరి లేదా మదనపల్లి వెళ్లాలని సూచించారు. గ్రామ సమీపంలోకి రాగానే భాస్కర్‌ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్నేహితుల మధ్య గొడవ జరిగిన ప్రాంతంలోనే ఉంచారు. కదిరి గ్రామీణ సీఐ మధు, తనకల్లు ఎస్సై రాంభూపాల్‌ ఘటనా ప్రాంతానికి వెళ్లి విచారణ చేపట్టారు. భాస్కర్‌కు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా ఇద్దరికీ వివాహమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని