Andhra News: మిస్టరీగా విద్యార్థినుల బలవన్మరణం
వీరు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనేది మిస్టరీగా మారింది. వీరిద్దరూ ప్రాణ స్నేహితులనే విషయం చనిపోయేంత వరకు తమకు తెలియదని తల్లిదండ్రులు అంటున్నారు. ఇరువురికి ఇంటి వద్ద ఎలాంటి సమస్యలు లేవు. చదువుల్లో ...
కడప నేరవార్తలు, న్యూస్టుడే: కడప రైల్వేస్టేషన్ పరిధి భాకరాపేట సమీపంలో సోమవారం రైలు పట్టాలపై పడి పూజిత(19), కల్యాణి(19) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వీరు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనేది మిస్టరీగా మారింది. వీరిద్దరూ ప్రాణ స్నేహితులనే విషయం చనిపోయేంత వరకు తమకు తెలియదని తల్లిదండ్రులు అంటున్నారు. ఇరువురికి ఇంటి వద్ద ఎలాంటి సమస్యలు లేవు. చదువుల్లో రాణిస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు లేవు. కడపకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరైనా వీరిని భయపెట్టారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ కాల్డేటా వివరాలు తెలిస్తే ఆత్మహత్యల మిస్టరీ చిక్కుముడి వీడుతుందని పోలీసులు చెబుతున్నారు. సోమవారం అనంతపురంలో మరో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. ఆ ముగ్గురి ఆచూకీ తెలిసింది. వారితో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. విద్యాదీవెనకు సంబంధించి పని ఉందని కల్యాణి తాడిపత్రి నుంచి సొంతూరైన యాడికి మండలం కమలపాడు సచివాలయానికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. పూజిత కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వచ్చింది. వీరిద్దరూ తాడిపత్రిలో సోమవారం ఉదయం 9.42 గంటలకు కర్ణాటక బస్సు ఎక్కి కడపలో దిగారు. కడప బస్టాండులో దిగిన తరువాత ఇరువురు సంతోషంగా స్వీయచిత్రం తీసుకున్నారు. తరువాత రైల్వేస్టేషన్కు వెళ్లారు. 1.30 గంటలకు రైల్వేస్టేషన్లో సంచరించినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలిసింది. రాజంపేట వైపు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఇటు రాకూడదని చెప్పడంతో అక్కడ నుంచి ఆటోలో ఎర్రముక్కపల్లె రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. పట్టాలపై నడుచుకుంటూ వస్తుండడం గూడ్స్ రైలు డ్రైవర్ చూసి వేగాన్ని తగ్గించడంతో వారు పట్టాలు దిగారు. తరువాత గూడ్స్ రైలు దగ్గరికి రాగానే ఇద్దరూ ఒక్కసారిగా రైలు పట్టాలపై పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కల్యాణి అక్కడికక్కడే మృతి చెందగా, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పూజిత మృతి చెందింది. బిడ్డల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. వీరిద్దరి మృతికి కారణాలు తెలియవని, సొంతూరికి వెళ్లాల్సిన కల్యాణి కడపకు ఎందుకు వచ్చిందో తెలియదని కల్యాణి బాబాయ్ బలరాం పేర్కొన్నారు. ‘పూజిత గత రెండు నెలల నుంచి ఒంటరితనానికి గురవుతుండేది. ఇంటి వద్ద ఎలాంటి గొడవలు లేవు. కళాశాలలో ఏవైనా సమస్యలు ఉన్నాయేమో తెలియదు. కల్యాణి, పూజిత స్నేహితులనే విషయం ఇప్పటి వరకు మాకు తెలియదు’ అని పూజిత సోదరుడు నాగార్జున్ తెలిపారు. ‘ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియరాలేదు. తమ సిబ్బందిని తాడిపత్రికి పంపించి వీరు చదివే కళాశాలలో విచారణ చేయిస్తున్నాం. ఫోన్ కాల్డేటా వివరాలు సేకరిస్తున్నాం’ అని కడప రైల్వే ఎస్సై రారాజు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
[ 18-05-2024]
‘శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేసిన రామకృష్ణారెడ్డి.. అధికారిక వాహనాలను (కార్లు) సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు విహారయాత్రలకు రెక్టార్, రిజిస్ట్రార్లకు కేటాయించిన కార్లను వాడుకున్నారు. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
[ 18-05-2024]
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఇసుకాసురుల ఆగడాలు ఆగేనా?
[ 18-05-2024]
ఐదేళ్లపాటు ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. నిబంధనలను లెక్కచేయకుండా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. అధికారం వారి చేతుల్లో ఉండటంతో అధికారులు సైతం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. -
అంతా.. నిశ్శబ్దం
[ 18-05-2024]
ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లతో రాష్ట్రంలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన తాడిపత్రిలో నిశబ్ద వాతావరణం నెలకొంది. తాడిపత్రి పట్టణ వాసులకు వైకాపా మూకల అరాచక పర్వాన్ని గుర్తు చేసుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతోంది. -
ఉత్తర మండలాల్లో మోస్తరు వర్షం
[ 18-05-2024]
జిల్లాలోని ఉత్తర మండలాల్లో గురువారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. డి.హీరేహాళ్ మండలంలో 28.8 మి.మీలు అత్యధికంగా వర్షం కురిసింది. -
ఓటర్ల ఓపికకు పరీక్ష
[ 18-05-2024]
సగటున ఒక నిమిషంలోపే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు చెరొక ఓటు వేసే వీలున్నా.. గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓటర్ల సహనానికి, ఓపికగా ఎన్నికల సంఘం పరీక్ష పెట్టింది. -
విద్యుత్తు నియంత్రికల మంజూరులో కీలక అధికారి తీరే వేరప్పా..
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లా విద్యుత్తుశాఖలో ఓ కీలక అధికారి అధికార పార్టీ తొత్తుగా మారిపోయారు. వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తే చాలు.. వెంటనే విద్యుత్తు నియంత్రికలు మంజూరు చేసి తన విధేయతను చాటుకుంటున్నారు.రెండేళ్లలో 300 పైగా 25కేవీ సామర్థ్యంగల నియంత్రికలు మంజూరు చేశారంటే ఆయన వైకాపా నేతలతో ఎంత అంటకాగారో అర్థం చేసుకోవచ్చు. -
బీఎల్ఓలకు రిక్తహస్తం!
[ 18-05-2024]
బూత్ స్థాయి అధికారులపై(బీఎల్ఓ) ఎన్నికల అధికారులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. పని చేయించుకుని పైసా పారితోషకం ఇవ్వడం లేదు. ఓటరు జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఇంటింటా సర్వే.. ఇలా అనేక కీలక పనులు చేస్తున్న బీఎల్ఓల పట్ల కనికరం చూపడం లేదు. -
అవసరమైతేనే సిజేరియన్ చేయండి
[ 18-05-2024]
పలు ఆసుపత్రుల్లో గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారని, అవసరమైతే తప్ప చేయకూడదని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.బి.దేవి తెలిపారు. శుక్రవారం అనంతపురంలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో సిజేరియన్ ద్వారా ఎక్కువ ఆపరేషన్లు చేసిన డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. -
‘తాడిపత్రిలో అల్లర్లకు ఆజ్యం పోసింది వైకాపా ఎమ్మెల్యేలే’
[ 18-05-2024]
తాడిపత్రి పట్టణంలో జరిగిన దాడులకు తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామిరెడ్డిలు ముఖ్య కారణమని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ ఆరోపించారు. -
తాగునీటి సరఫరా అధ్వానం.. ఎటు చూసినా అపరిశుభ్రం
[ 18-05-2024]
ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంతోపాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
[ 18-05-2024]
ముదిగుబ్బ మండలంలోని గుంజేపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన లింగప్ప కుమారుడు రాజు (27) ముదిగుబ్బకు ఆటో నడుపుకొంటూ జీవనం సాగించే వాడు. అతనికి ఐదేళ్ల కిందట వివాహమైంది. -
రేషన్ పంపిణీకి నేడు ఆఖరు
[ 18-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీపై ఎన్నికల ప్రభావం పడింది. ఈ నెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారం తదితర కారాణాల వల్ల కార్డుదారులకు సరకులు అందలేదు. -
చెన్నకేశవుడి రాజసం
[ 18-05-2024]
పట్టణంలో జరుగుతున్న లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సర్వ భూపాల వాహనం, రాత్రి సింహ వాహనంపై స్వామి వారు పురవీధుల్లో విహరించారు. -
భక్తుల కష్టాలు ఖాద్రీశుడికే ఎరుక!
[ 18-05-2024]
శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆవహించింది. పుణ్యక్షేత్రంగా కదిరి ఆలయానికి వేలాది మంది వచ్చే దర్శన భక్తులకు తగిన సదుపాయాలు కలగక అవస్థలతో ప్రశాంత దర్శన భాగ్యం పొందలేకున్నారు. -
ఇదేంది సారూ.. పారితోషికంలో తేడాలా?
[ 18-05-2024]
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించగల సత్తా ఉపాధ్యాయులకే ఉందని, వారిని తప్పించి, ఇతరులతో ఈ ప్రక్రియను నిర్వహిస్తే అస్తవ్యస్తమవుతుందని, వారు మాత్రమే కచ్చితంగా నిర్వహించగలరని ఎన్నికల సంఘం కితాబు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్