logo

వైకాపాను గద్దె దించడమే లక్ష్యం

యువత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క జాబ్‌ క్యాలెండరు ప్రకటించలేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్‌ ధ్వజమెత్తారు.

Published : 10 Aug 2022 05:10 IST

భాజపా నాయకుల ద్విచక్ర వాహన ప్రదర్శన

అరవిందనగర్‌(అనంతపురం), న్యూస్‌టుడే: యువత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క జాబ్‌ క్యాలెండరు ప్రకటించలేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్‌ ధ్వజమెత్తారు. నిరుద్యోగులను మోసం చేసిన వైకాపా ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆగష్టు 2న తిరుపతిలో మొదలైన యువ సంఘర్షణ యాత్ర మంగళవారం అనంతపురం చేరుకుంది. కలెక్టరు కార్యాలయం నుంచి పాతూరు నీలం థియేటర్‌, శ్రీకంఠం కూడలి, గడియార స్తంభం, సప్తగిరి కూడలి మీదుగా ప్రదర్శన సాగింది. యువమోర్చ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బైక్‌ ర్యాలీని కేతినేని సురేంద్రమోహన్‌తో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులను, అన్ని రంగాల్లోని వారిని నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, వెంకటేశ్వరరెడ్డి, లలిత్‌కుమార్‌, ఫయాజ్‌, ఆనంద్‌, రాజేశ్‌, అమర్‌నాథ్‌, యం.శ్రీనివాసులు, సోమయ్య, రవితేజ, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని