logo

వాహనం ఢీకొని కాడెద్దులు మృతి

ఎడ్లబండ్లను వాహనం వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో రెండు కాడెద్దుల మృతి చెందాయి. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని తురకలాపట్నం గ్రామానికి చెందిన రైతులు పురుషోత్తం, రాంగోపాల్‌, భాస్కర్‌ ఆదివారం ఉదయం తమ ఎడ్లబండ్లతో పెన్నానదిలో ఇసుక తరలింపునకు వెళ్తున్నారు. పెనుకొండ వైపు నుంచి వస్తున్న పాల వాహనం పాతర్లపల్లి సమీపంలో

Published : 15 Aug 2022 05:22 IST

సంఘటనా స్థలంలో మృతి చెందిన ఎద్దులు

రొద్దం: ఎడ్లబండ్లను వాహనం వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో రెండు కాడెద్దుల మృతి చెందాయి. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని తురకలాపట్నం గ్రామానికి చెందిన రైతులు పురుషోత్తం, రాంగోపాల్‌, భాస్కర్‌ ఆదివారం ఉదయం తమ ఎడ్లబండ్లతో పెన్నానదిలో ఇసుక తరలింపునకు వెళ్తున్నారు. పెనుకొండ వైపు నుంచి వస్తున్న పాల వాహనం పాతర్లపల్లి సమీపంలో రహదారిపై వెళ్తున్న ఎడ్లబండ్లకు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో పురుషోత్తంకు చెందిన ఎద్దుల అక్కడికక్కడే మృతి చెందాయి. రాంగోపాల్‌కు చెందిన ఒక ఎద్దుకు గాయాలయ్యాయి. ఇద్దరు రైతులు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో కాడి ఎద్దులు మృతి చెందినట్లు రైతులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని