logo

ఎన్టీఆర్‌ ఆరోగ్య రథం ప్రారంభం నేడు

హిందూపురం, లేపాక్షి మండలాల్లో బుధ, గురువారాల్లో జరిగే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటనను విజయవంతం చేయాలని తెదేపా నాయకులు కోరారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడి

Published : 17 Aug 2022 03:54 IST

హిందూపురం అర్బన్‌, లేపాక్షి: హిందూపురం, లేపాక్షి మండలాల్లో బుధ, గురువారాల్లో జరిగే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటనను విజయవంతం చేయాలని తెదేపా నాయకులు కోరారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడి వివాహానికి హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు హిందూపురం మండలం చలివెందులలో ఎన్టీఆర్‌ ఆరోగ్య రథాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు లేపాక్షిలో నిర్వహించే బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరవుతారు. గురువారం ఉదయం 9.30 గంటలకు కొట్నూరు ఉన్నత పాఠశాల ఆవరణలో హెరిటేజ్‌ ఆధ్వర్యంలో పాఠశాలలకు టీవీలు అందజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని