logo

చౌక బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న చౌకబియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు శనివారం పట్టుకున్నారు. లారీ పామిడి రోడ్డులో నుంచి గుంతకల్లు వైపు వస్తున్నట్లు తెలుసుకున్న విజిలెన్స్‌ అధికారులు బాలకృష్ణయ్య, పుల్లారెడ్డి దోనిముక్కల వద్ద దాడి చేసి పట్టుకున్నారు.

Published : 04 Dec 2022 04:35 IST

గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న చౌకబియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు శనివారం పట్టుకున్నారు. లారీ పామిడి రోడ్డులో నుంచి గుంతకల్లు వైపు వస్తున్నట్లు తెలుసుకున్న విజిలెన్స్‌ అధికారులు బాలకృష్ణయ్య, పుల్లారెడ్డి దోనిముక్కల వద్ద దాడి చేసి పట్టుకున్నారు. 224 క్వింటాళ్ల (448 సంచులు ఒక్కో సంచి 50 కేజీలు) బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సీఎస్‌డీటీ సుబ్బలక్ష్మికి అప్పగించారు. లారీని, బియ్యం తరలిస్తున్న వెంకటరమణ, శివయ్యను రూరల్‌ పోలీసులకు అప్పగించినట్లు వారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని