logo

చంపుతామని బెదిరించారు

‘కుటుంబసభ్యులను వేధిస్తున్నారు. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. అందుకే వీడి పోతున్నాను. అమ్మా, నాన్న ఇక సెలవు’ అంటూ కణేకల్లు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వన్నూరుస్వామి(27) అనే యువకుడు బెంగళూరులో మంగళవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated : 08 Dec 2022 04:57 IST

ప్రేమ వ్యవహారంలో యువకుడి ఆత్మహత్య

వన్నూరుస్వామి (పాతచిత్రం)

కణేకల్లు, న్యూస్‌టుడే: ‘కుటుంబసభ్యులను వేధిస్తున్నారు. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. అందుకే వీడి పోతున్నాను. అమ్మా, నాన్న ఇక సెలవు’ అంటూ కణేకల్లు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వన్నూరుస్వామి(27) అనే యువకుడు బెంగళూరులో మంగళవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన పోతన్నకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు వన్నూరుస్వామి బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే మండలానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె తండ్రి చిక్కణ్ణ వైకాపా నాయకుడు. ప్రేమ వ్యవహారం తెలియడంతో తనను చంపుతామని ఆరునెలలుగా బెదిరించినట్లు మూడు పేజీల సూసైడ్‌నోట్‌లో యువకుడు రాసుకున్నాడు. ఇతరులతో తనను కొట్టించాడని, ఫోన్‌లు చేయించినట్లు పేర్కొన్నాడు. కుటుంబీకులను కూడా వేధించారని కొందరి పేర్లు కూడా అందులో పేర్కొన్నాడు. ఫోన్‌ కూడా ఎవరో లాక్కెళ్లిపోయారని తన స్నేహితుడు, అన్నకు సమాచారం ఇవ్వాలని వారి ఫోన్‌ నెంబర్లు సూసైడ్‌ నోట్‌లో రాశాడు. ఈ విషయమై ఎస్సై దుగ్గిరెడ్డిని వివరణ కోరగా ప్రేమ విషయమై యువతి తండ్రి తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. యువకుడిని ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేసినా అందుబాటులోకి రాలేదని చెప్పారు. యువకుడి మృతదేహానికి బెంగళూరులో పంచనామా నిర్వహించి బుధవారం రాత్రి స్వగ్రామానికి తీసుకురానున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని