బాలికను జోగినిగా మార్చే యత్నం..
బడి మానేసిన ఓ 16 ఏళ్ల బాలికను జోగిని వ్యవస్థలోకి దించేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు.
అడ్డుకున్న అధికారులు
బొమ్మనహాళ్, న్యూస్టుడే: బడి మానేసిన ఓ 16 ఏళ్ల బాలికను జోగిని వ్యవస్థలోకి దించేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటన రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని ఓ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన బాలికను కర్ణాటకలోని హొసపేటె జిల్లాలోని హులిగికి తీసుకుని వెళ్లి అమ్మవారికి జోగినిగా (బసివినిగా) మార్చేందుకు తల్లిదండ్రులు, బంధువులు ప్రయత్నం చేశారు. దీనిపై గ్రామస్థులు సోమవారం బాలికల సంరక్షణ సహాయ కేంద్రం 1098కు చరవాణిలో సమాచారం ఇచ్చారు. వెంటనే సహాయ కేంద్రం సిబ్బంది, తహసీల్దారు శ్రీనివాసులు, ఎస్ఐ శివ, ఆర్డీటీ ఏటీఎల్ శ్రీనివాస్రెడ్డి, ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. బాలికతో పాటు తల్లిదండ్రులు హులిగికి వెళ్లడానికి బళ్లారిలో ఉండగా గుర్తించి వెనక్కు తీసుకుని వచ్చారు. బాలిక, తల్లిదండ్రులకు తహసీల్దారు కార్యాలయంలో అధికారులు అవగాహన కల్పించారు. బాలిక తండ్రి మాట్లాడుతూ తమపై గ్రామస్థులు అసత్య ప్రచారం చేశారనీ.. తాము హలిగిలోని ఉలిగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళుతున్నామని అన్నారు. బాలికను స్థానిక కస్తూర్బా పాఠశాలలో చేర్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దారు చెప్పారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పలు మండలాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నందున ఈ ప్రాంతంలో బాలికలను చిన్న వయసులోనే జోగినిగా మార్చే దురాచారం ఇంకా కొనసాగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.