logo

Anantapur: అనుమానంతో నిద్రిస్తున్న భార్యను అంతమొందించాడు

భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేసి హతమార్చాడు.

Updated : 04 Nov 2023 07:29 IST

నారాయణమ్మ

అనంత నేరవార్తలు: భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేసి హతమార్చాడు. ఈ ఘటన అనంత నగరంలో చోటు చేసుకుంది. ఉరవకొండకు చెందిన భార్యాభర్తలు  నారాయణమ్మ(38), నాగరాజులు కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. రుద్రంపేటలో నివాసముంటూ నాగరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా భార్యపై అనుమానంపై తరచూ ఆమెతో గొడవపడేవాడు. గురువారం రాత్రి మరోసారి ఘర్షణ పడ్డారు.  భార్యను అంతమొందించాలని పథకం వేసిన అతడు శుక్రవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్యపై రోకలితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. తల ఛిద్రమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయాన్నే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిని పరిశీలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. రుద్రంపేట బైపాస్‌లో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని నాలుగో పట్టణ సీఐ ప్రతాపరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని