logo

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 29 Mar 2024 04:16 IST

ప్రమాణస్వీకారం చేస్తున్న జిల్లా అధ్యక్ష, కార్యదర్శితో నూతన కార్యవర్గ సభ్యులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని గణేశ్‌ కూడలిలోని షాదీమహాల్‌లో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రశాఖ కార్యవర్గ సభ్యులు రఘురామనాయుడు,  అనంతపురం, కడప జిల్లా అధ్యక్షులు గోపికృష్ణ, రమేశ్‌ ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా వి.భాస్కర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శిగా మహేశ్వరరెడ్డి, ట్రెజరర్‌గా నారాయణరెడ్డి, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ నాగేంద్రాయక్‌, జిల్లా కార్యదర్శిగా సుందరరాజు, ఉపాధ్యక్షులుగా చెన్నారెడ్డి, విశ్వతేజ, శ్రీనివాసులు, హేమేనాయక్‌, గోవిందప్ప, రమేశ్‌రెడ్డి, బాబాఫకృద్దీన్‌, జిల్లా సహాయ కార్యదర్శులుగా శ్రీదేవి, మల్లికార్జున, తిరుపాలు, గోపినాయక్‌, రామచంద్రారెడ్డి, చంద్రమౌళి, వెంకటేశులతోపాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. నూతనంగా ఎంపికైన కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. సమష్టిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని