జగన్ పాలనలో .. ఉద్యానాలు కనుమరుగు
జగన్ ప్రభుత్వంలో పట్టణవాసికి ఆహ్లాదాన్ని అందించాల్సిన ఉద్యానవనాలు ఉనికిని కోల్పోయాయి. వీటిని సంరక్షించాల్సిన పురపాలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త పార్కుల ఏర్పాటును గాలికి వదిలేశారు.
పట్టణాల్లో కనిపించని ఆహ్లాదం
పాడైన ఆట పరికరాలు
న్యూస్టుడే, గుంతకల్లు: జగన్ ప్రభుత్వంలో పట్టణవాసికి ఆహ్లాదాన్ని అందించాల్సిన ఉద్యానవనాలు ఉనికిని కోల్పోయాయి. వీటిని సంరక్షించాల్సిన పురపాలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త పార్కుల ఏర్పాటును గాలికి వదిలేశారు. అమృత్ పథకం కింద కేటాయించిన నిధుల సద్వినియోగంలో విఫలమవుతున్నారు. ఫలితంగా ఉద్యానవనాల్లో పిల్లలకు ఆటవిడుపుగా ఏర్పాటు చేసిన ఆట పరికరాలు ధ్వంసమయ్యాయి. పచ్చదనం ఆవిరైపోయింది. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయిలోని పరిస్థితిపై కథనం
పిల్లలకు ఆట విడుపు ఏదీ?
రాజేంద్రనగర్లోని పురపాలక ఉద్యానవనాన్ని ఎకరా స్థలంలో ఆరేళ్ల కిందట ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు పాడైపోయి రెండేళ్లవుతున్నా అధికారులు వాటిని పట్టించుకోలేదు. పరిసరాల్లో సుమారు 12 వేల జనాభా ఉంటుంది. ఇక్కడి వాసులు సెలవు దినాల్లో పిల్లలతో కలిసి సరదాగా గడపడానికి అనువైన పరిస్థితి లేకపోవడం లేదు. పార్కులో పూర్తి స్థాయిలో పచ్చదనం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. నీటి సౌకర్యం పుష్కలంగా ఉన్నా
ఆదిలోనే హంసపాదు
మొదినాబాదులో మున్సిపాలిటీకి చెందిన ఎకరా స్థలంలో అధికారులు పార్కుల ఏర్పాటు పనులు చేపట్టారు. ఆ పనులన్నీ నాలుగేళ్ల కిందట అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇక్కడ నీటి కోసం ట్యాంకును ఏర్పాటు చేసినా, అక్కడ నీటి వసతి లేదు. పిల్లల కోసం క్రీడా పరికరాలు ఏర్పాటు చేయలేదు. పార్కులో మొక్కలు నాటింది లేదు. వ్యాయామ పరికరాలు కంపచెట్లలో కూరుకుపోయాయి. పార్కు పనులకు సంబంధించి అధికారులు ఇంకా రూ.24 లక్షలు ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు జరిగిన పనులన్నీ వృథా అయ్యాయి.
మొక్కలు నాటి పెంచే వారే కరవయ్యారు
మొక్కలు లేని హంపయ్య పార్కు హంపయ్య కాలనీలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ. 52 లక్షలు కేటాయించింది. ఇక్కడ జిమ్, చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశారు. ఆరేళ్ల కిందట పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన పరికరాలన్నీ తుప్పు పట్టిపోయాయి. మొక్కలు నాటిన దాఖలాలు లేవు. మొక్కలు నాటేందుకు రూ.10 లక్షలు ఉన్నా ఈ నిధులతో మొక్కలు కొనకూడదని, ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ఉన్నతాధికారులు చెప్పడంతో పురపాలక అధికారులు పట్టించుకోలేదు.
ఐదేళ్లు పచ్చందాలు కరవు
తాడిపత్రి : తాడిపత్రి పురపాలికలో వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క ఉద్యానవనం ఏర్పాటు చేయలేదు. తెదేపా హయాంలో సంజీవనగర్, పెన్నానది ఒడ్డున నిర్మించిన ఉద్యానవనాలను అభివృద్ధి చేయలేదు. పురపాలికలో 36 వార్డులు, సుమారు 1.30 లక్షల జనాభా ఉంది. తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే జేసీˆ ప్రభాకర్రెడ్డి పట్టణంలో ఉద్యానవనాల కోసం ఐదు కాలనీల్లో స్థలాలను సేకరించి ప్రహరీలు నిర్మించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఎక్కడా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. అరకొర వసతులతో సంజీవనగర్లో ఉన్న చిన్నారుల ఉద్యానవనం, పెన్నానదిలో జేసీˆ ప్రభాకర్రెడ్డి సొంత నిధులతో నిర్మించిన ఉద్యానవనమే దిక్కైంది. సంజీవనగర్లో ఉన్న ఉద్యానవనంలో చిన్నారులు ఆడుకునే పరికరాలన్నీ ధ్వంసమయ్యాయి.
వర్షాకాలంలో మూతే
తాడిపత్రిలోని సంజీవనగర్లో ఉన్న చిన్నపిల్లల ఉద్యానవనంలో వర్షాకాలంలో భారీగా నీరు నిల్వ ఉంటుంది. ఆసమయంలో ఉద్యానవనాన్ని మూసేస్తారు. అధికారులు, పాలకులు అటువైపు చూసే పాపానపోలేదు. ఐదేళ్లలో పురపాలికలో ఎక్కడా ఒక్క ఉద్యానవనం ఏర్పాటు చేయలేదు.
లక్ష్మీరెడ్డి, సంజీవనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రజాప్రతినిధుల అనుచరులే.. అసురలై
[ 06-05-2024]
నిత్యం మూడు కబ్జాలు, ఆరు ఆక్రమణలతో వైకాపా ప్రజాప్రతినిధులు అవినీతి చక్రవర్తుల్లా మారిపోయారు. మేం తక్కువ తిన్నాం అంటూ వారి అనుచరులు మండలాల్లో అరాచకాలకు పాల్పడుతూ సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు. -
ఉద్యోగులకు ప్రలోభాల ఎర
[ 06-05-2024]
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొనడానికి వైకాపా బరి తెగించింది. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా పోలింగ్ కేంద్రాల (ఫెసిలిటేషన్) వద్దే వైకాపా శ్రేణులు బేరసారాలకు ఒడిగట్టారు. -
ఎన్నికల ముందు హామీలు.. ఆనక నామాలు
[ 06-05-2024]
-
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అనంత అభివృద్ధి
[ 06-05-2024]
వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర మంత్రి అమిత్షా, తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అనంతపురం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. -
గొడవలపై ఉక్కుపాదం మోపండి
[ 06-05-2024]
‘ఎన్నికల నిర్వహణను సవాల్గా తీసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా సాగాలంటే.. గొడవలు, రౌడీలపై ఉక్కుపాదం మోపాలి. శాంతిభద్రల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలి’ అని ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా పేర్కొన్నారు. -
తెదేపా హయాంలో ఏర్పాటు.. వైకాపా పాలనలో గ్రహపాటు
[ 06-05-2024]
సమూల మార్పులతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని గొప్పలు చెబుతున్న వైకాపా ప్రభుత్వం గురుకులాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. -
వైకాపా వ్యతిరేక ఓటును ఆపేందుకు ప్రయత్నం
[ 06-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ ఉద్యోగి ఎక్కడ ఓటు వినియోగించుకోవాలో.. స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. -
ఫాం-12 ఇచ్చాం.. మా పేర్లు ఏమయ్యాయి
[ 06-05-2024]
‘ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఫాం-12 సకాలంలో ఇచ్చాం. మేము పని చేసే చోటే ఆర్ఓలకు సమర్పించాం. ఇపుడు ఓటు వేసేందుకు వస్తే.. పేర్లు లేవంటారు. -
గుంతకల్లు భగభగ
[ 06-05-2024]
ఉమ్మడి జిల్లాలో ఆదివారం గుంతకల్లులో అత్యధికంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెట్టేనా?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు