logo

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు

ధర్మవరం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 2వ పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. శారదానగర్‌లో భాజపా కార్యకర్తలు భాను, శ్రీనివాసులుపై వైకాపా వర్గీయులు శుక్రవారం రాత్రి దాడి చేశారు.

Published : 05 May 2024 03:28 IST

ధర్మవరం, న్యూస్‌టుడే : ధర్మవరం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 2వ పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. శారదానగర్‌లో భాజపా కార్యకర్తలు భాను, శ్రీనివాసులుపై వైకాపా వర్గీయులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. దాడి ఘటనపై భాజపా కార్యకర్త భాను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మారుతి, వినయ్‌, అమరనాథ్‌రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 324, 427, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

భాజపా అభ్యర్థిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ..

ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకుమార్‌పై ధర్మవరం 2వ పట్టణ పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కులం పేరుతో తనను సత్యకుమార్‌, భాజపా నాయకుడు రాజారెడ్డి దూషించారని శారదానగర్‌కు చెందిన వైకాపా వర్గీయుడు గోపాల్‌నాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని