logo

వైకాపా ప్రచారానికి వెళ్లలేదని మాజీ వాలంటీరుపై దాడి

వైకాపా ప్రచారానికి వెళ్లలేదని పట్టణంలోని 19 వార్డు కౌన్సిలర్‌ భాగ్యమ్మ, ఆమె కుమారుడు మారుతి పరుష పదజాలంతో దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారని మాజీ వాలంటీరు నళిని ఆరోపించారు.

Published : 07 May 2024 05:07 IST

కళ్యాణదుర్గం గ్రామీణం: వైకాపా ప్రచారానికి వెళ్లలేదని పట్టణంలోని 19 వార్డు కౌన్సిలర్‌ భాగ్యమ్మ, ఆమె కుమారుడు మారుతి పరుష పదజాలంతో దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారని మాజీ వాలంటీరు నళిని ఆరోపించారు. సోమవారం ఆమె మాట్లాడారు. ‘ఇటీవల వాలంటీరు ఉద్యోగానికి రాజీనామా చేయించారు. పార్టీపై అభిమానంతో ప్రచారంలో పాల్గొంటున్నా. రెంండ్రోజుల నుంచి అనారోగ్యం కారణంగా ప్రచారానికి వెళ్లలేకపోయాను. సోమవారం సాయంత్రం కౌన్సిలర్‌ ఇంటి వద్ద ఓటర్ల సెల్‌ఫోన్‌ నంబర్లు రాస్తుండగా ఎందుకు ప్రచారానికి రాలేదని దాడి చేశారు. ప్రశ్నించినందుకు నాతోపాటు అమ్మ, చెల్లిపై దాడి చేశారని నళిని కన్నీటి పర్యంతమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని